టీవీ: సుమ ప్రోగ్రాంలో కన్నీళ్లు పెట్టుకున్న తమన్నా.. కారణం ఏమిటంటే..!!

Divya
బుల్లితెరపై యాంకర్ సుమ వ్యాఖ్యాతగా గత కొన్ని సంవత్సరాలుగా రాణిస్తూనే ఉన్నది. దీంతో ఈమెకు మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక బుల్లితెరపై సాగే పలు కార్యక్రమాలలో క్యాష్ ప్రోగ్రామ్ కూడా ఒకటి. గత ఎపిసోడ్తో ఈ కార్యక్రమం తాజాగా 200 ఎపిసోడ్ పూర్తి చేసుకున్నది. ఇలా 200 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడంతో ఈ కార్యక్రమానికి F-3 ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం హాజరు కావడం జరిగింది. ఈ క్రమంలోనే ఇందులో హీరోయిన్ తమన్నా, డైరెక్టర్ అనిల్ రావిపూడి, సోనాల్ చౌహాన్, సునీల్ వంటి వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ని సుమ వీరి చేత ఎప్పట్లాగే ఫన్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. వీరితో కలిసి పలు రకాలుగా టాస్క్ లు చేస్తూ కడుపుబ్బ నవ్వించింది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమో కూడా విడుదల అవ్వడం జరిగింది.. ఈ ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ తమన్నా కన్నీళ్లు పెట్టుకున్నట్లు చూపించారు అయితే తమన్నా ఈ కార్యక్రమంలో అలా కన్నీళ్లు పెట్టుకోవడానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ తమన్నా, సోనాల్ చౌహాన్ కు ఒక టాస్క్ ను నిర్వహించారు. ఈ టాస్క్ లో భాగంగా సుమ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుంటే..అలనాటి నటి మహానటి ఎలాగైతే తమ ఎడమ కంటి నుండి కన్నీటిని కారుస్తుందో అలా ఏడవాలని యాంకర్ సుమ తెలుపుతుందట. ఈ కార్యక్రమంలో నే సుమ తమన్నాను ప్రశ్నిస్తూ ఉంటుంది.. ఈ ఇద్దరిలో ఎవరు డాన్స్ చేసేటప్పుడు మీరు చాలా ఎనర్జిటిక్గా ఫీల్ అవుతారని అడగగా.. అందులో ఎన్టీఆర్, అల్లు అర్జున్ మీద ప్రశ్న వేయగా ఈ ప్రశ్నకు తమన్నా సమాధానం చెప్పలేక పోవడంతో అలనాటి నటి సావిత్రి మాదిరిగా తన ఎడమ కంటి నుండి కన్నీరు కార్చడం జరిగిందట. ఈ ఏడవ టాన్ని ప్రోమో లో హైలెట్ చేసి భారీగా వ్యూస్ సంపాదించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: