టీవీ: హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్ చెంప పగులగొట్టిన రోజా.. కారణం..?

Divya
ఈ టీవీ లో మల్లెమాల సంస్థ వారు.. జబర్దస్త్ తో పాటు మరికొన్ని ఇతర షో లను కూడా చేస్తూ ఉంటారు. ఏదైనా పండుగ రోజున అందులోని కంటెస్టెంట్లతో ఏదో ఒక ఎపిసోడ్ చేస్తూ ఉంటారు మల్లెమాల సంస్థవారు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు జబర్దస్త్ కంటెస్టెంట్ లు అంతా కలిసి ఈ ఉగాది పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు ప్రేక్షకుల ముందుకు ఒక షో ద్వారా రావడం జరిగింది.. ఈ కార్యక్రమానికి "అంగరంగ వైభవంగా" అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేయడం జరిగింది.

ఇక ఎప్పటిలాగే ఇందులో హైపర్ ఆది , రాంప్రసాద్ తో పాటు మరికొంతమంది జబర్దస్త్ కమెడియన్ కూడా పాల్గొనడం జరిగింది. తాజాగా ఈ షో కు సంబంధించి ఒక ప్రోమో కూడా వైరల్ గా మారుతోంది. ఎట్టకేలకు ఈ షో ని సక్సెస్ ఫుల్ కామెడీ గా సాధించేందుకు ప్రదీప్, శ్రీముఖి, రష్మీ వంటివారిని కూడా చూపించడం జరిగింది..అయితే ఈ షోలో చివర్లో మాత్రం రోజా కమెడియన్ బుల్లెట్ భాస్కర్ మరియు ఆది లపై చేయి చేసుకున్నట్లుగా కనిపించింది. దీంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారుతోంది. అయితే మరికొంతమంది మాత్రం ఇలాంటి వీడియోలు మేము ఎన్నో చూసాము అన్నట్లుగా ప్రేక్షకులు తెలియజేస్తున్నారు.
ఇవన్నీ కూడా ఒక ఫ్రాంక్ అన్నట్లుగానే ఉంటాయి అని అంటున్నారు. ఈసారి కూడా అలాంటిదే ఉంటుందని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. కానీ అక్కడ జరిగిన రియాక్షన్ యాక్షన్ సీన్ చూస్తుంటే మాత్రం చాలా సీరియస్ గా  జరిగినట్లుగా కనిపించడం జరుగుతుంది. అయితే రోజా బుల్లితెరపై, వెండితెర పై ప్రస్తుతం మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే రోజా ఎప్పుడూ నవ్వుతూ ప్రేక్షకులను బాగా నవ్విస్తూ ఉండేది.. కానీ ఈ సారి ఇలా చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే రోజు నిజంగానే వీరిద్దరి చెంప పగలగొట్టిందా అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అది నిజమో కాదో తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: