టీవీ: శేఖర్ మాస్టర్ కూతురు డాన్సుకు ఫిదా అవ్వాల్సిందే..!!
అయితే ఇప్పుడు తాజాగా హీరోయిన్ అనుపమ రౌడీ బాయ్స్ మూవీ లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక అందులో ఒక పాట బాగా ట్రెండీగా మారిపోయింది.. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే అనే పాట ప్రస్తుతం బాగా వైరల్ గా మారింది. ఇక అమ్మాయిలు అయితే ఈ పాటకు కొన్ని వేల రీల్ వీడియోలు చేయడం జరిగిందట. ప్రస్తుతం ఈ పాట ఇప్పటికీ మంచి ట్రెండింగ్లో కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ పాటకు శేఖర్ మాస్టర్ కూతురైన సాహితీ కూడా స్టెప్పులు వేయడం జరిగింది.
ఇక ఈ పాటకు శేఖర్ మాస్టర్ స్వయంగా కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈ పాట పాడినందుకు దేవిశ్రీ ప్రసాద్ కి, డ్యాన్స్ చేయించినందుకు శేఖర్ మాస్టర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేసింది అనుపమ. తాజాగా శేఖర్ మాస్టర్ కూతురు వేసిన ఈ స్టెప్పులను కూడా అనుపమ తన సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో పై శేఖర్ మాస్టర్ స్పందించడం కూడా జరిగింది.. శేఖర్ మాస్టర్ అడోరబుల్ అంటూ కామెంట్ రూపంలో తెలియజేశాడు.