టీవీ: శేఖర్ మాస్టర్ కూతురు డాన్సుకు ఫిదా అవ్వాల్సిందే..!!

Divya
ఒకప్పుడు ఎక్కువగా టిక్ టాక్ వీడియోలతో బాగా ఫేమస్ అయిన వారు కొంతమంది. కానీ అది బ్యాన్ చేసిన తర్వాత.. ఇప్పుడే ఎక్కువగా ఇంస్టాగ్రామ్ లో తమకు సంబంధించిన వీడియోలను చేసి అందులో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక సెలబ్రిటీలు సైతం అప్పుడప్పుడు తమకు సంబంధించిన వీడియోలను, రియల్ వీడియోలను చేస్తూ రెచ్చిపోతుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే బుల్లితెరపై కొంతమంది నటీనటులు కొన్ని రియల్ వీడియోస్ లను చేస్తూ ఉంటారు. తెగ ట్రెండింగ్ గా ఉండేటువంటి పాటలకు తనదైన స్టెప్పులు వేస్తూ బాగా అలరిస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా పుష్ప సినిమాలోని సామీ సామీ అనే పాటకు రష్మిక వేసిన స్టెప్పులను కొంతమంది చేస్తూ బాగా వైరల్ గా మారుతూ ఉంటారు.
అయితే ఇప్పుడు తాజాగా హీరోయిన్ అనుపమ రౌడీ బాయ్స్ మూవీ లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక అందులో ఒక పాట బాగా ట్రెండీగా మారిపోయింది.. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే అనే పాట ప్రస్తుతం బాగా వైరల్ గా మారింది. ఇక అమ్మాయిలు అయితే ఈ పాటకు కొన్ని వేల రీల్ వీడియోలు చేయడం జరిగిందట. ప్రస్తుతం ఈ పాట ఇప్పటికీ మంచి ట్రెండింగ్లో కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ పాటకు శేఖర్ మాస్టర్ కూతురైన సాహితీ కూడా  స్టెప్పులు వేయడం జరిగింది.
ఇక ఈ పాటకు శేఖర్ మాస్టర్  స్వయంగా కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈ పాట పాడినందుకు దేవిశ్రీ ప్రసాద్ కి, డ్యాన్స్ చేయించినందుకు శేఖర్ మాస్టర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేసింది అనుపమ. తాజాగా శేఖర్ మాస్టర్ కూతురు వేసిన ఈ స్టెప్పులను కూడా అనుపమ తన సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో పై శేఖర్ మాస్టర్ స్పందించడం కూడా జరిగింది.. శేఖర్ మాస్టర్ అడోరబుల్ అంటూ కామెంట్ రూపంలో తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: