టీవీ: పచ్చ బొట్టుతో రచ్చ చేస్తున్న వర్ష..అందుకేనా..?

Divya
 ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కన్నా జబర్దస్త్ కామెడీ షో తో బాగా పాపులారిటీ ని అందుకుంది ప్రముఖ నటి వర్ష.. వర్ష చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఇకపోతే జబర్దస్త్ షో ద్వారా ఈమె సహనటుడు ఇమ్మాన్యూయేల్ తో కలిసి చేసే రొమాన్స్ అంతా ఇంతా కాదు. ఒకపక్క ఇమ్మాన్యూయేల్ తో రొమాన్స్ చేస్తోంది..అది చూసిన చాలా మంది ఇతడిని ఎలా ఒప్పుకుంది అనే వార్తలు రోజురోజుకు ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ , ఆమె కేవలం షో కోసం మాత్రమే ఇలా చేస్తుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి వర్ష అందానికి తగ్గ అభినయంతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.

నిజానికీ వర్ష అసలు పేరు మాధవి శ్రీ..1997 వ సంవత్సరంలో పంజరం సినిమా ద్వారా  చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే.. 1998 వ సంవత్సరంలో  ఖైదీ గారు అనే  చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ పాత్రలో కనిపించింది.. వర్ష ఎక్కువగా తెలుగు నటులు అయిన  వెంకటేష్ ,మోహన్ బాబు, నాగార్జున ,  రాజశేఖర్ ,తరుణ్ ,  శ్రీకాంత్ , పవన్ కళ్యాణ్ , జగపతి బాబు ,  జూనియర్ ఎన్టీఆర్, రవితేజ వంటి ఎంతో మంది నటులతో నటించినప్పటికీ గుర్తింపు మాత్రం రాలేదు..అంతేకాదు ఈమె ఎవరో కూడా చాలా మందికి తెలీదు.
ఆ తర్వాత ఈటీవీ సీరియల్స్ లో కూడా బాగా నటించింది.ఇక ఈటీవీలో ప్రసారమవుతున్న అత్తారింటికి దారేది సీరియల్ ద్వారా తన నటనకు మంచిపేరు వచ్చింది. ఇకపోతే తాజాగా వర్ష వీపు మీద వేసుకున్న పచ్చబొట్టు అందాలతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తోంది.. తన అందాలతో ,సోయగాలతో అందరినీ ఆకర్షిస్తోంది..ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ మరింత పెంచి, అందరినీ ఆకట్టుకుంటోంది. ఏది ఏమైనా వర్ష సినిమాల కోసం మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేయడం కోసమే ఇలా చేస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఇక వర్ష అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: