"దేవత" సీరియల్ లో అలా జరిగితే అద్భుతమే?

VAMSI
మా టీవి ప్రేక్షకులకు ఎంతో నచ్చే సీరియల్స్ లో దేవత సీరియల్ కూడా ఒకటి. హీరోయిన్ సుహాసిని ఈ ధారావాహికలో లీడ్ రోల్ చేయడం, అగ్నిసాక్షి సీరియల్ తో పాపులారిటీ పెంచుకున్న అర్జున్ హీరోగా, చేయడంతో మొదట్లోనే అంచనాలను బాగా అందుకుంది. సీరియల్ మొదలయ్యాక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకానికి మించి సీరియల్ ను ఆదరిస్తున్న విధానం ఆ సీరియల్ దర్శకుడికే చెందుతుంది. ఈ సీరియల్ లో పక్క పల్లెటూరి అమ్మాయి రుక్మిణిగా సుహాసిని నటన ప్రేక్షకులను ప్రత్యేకించి ఆకట్టుకుంది. అయితే ఆదిత్య నుండి రుక్మిణి విడిపోవడం, దేవి కన్న తండ్రిని తెలియక ఆఫీసరు సారు అనడం, ఎవరినో నాన్న అనడం అది చూస్తూ కూడా రుక్మిణి మౌనంగా ఉండటం వంటింటి చాలా మంది ప్రేక్షకులకు నచ్చడం లేదని తెలుస్తోంది.
అందు లోనూ పదేళ్లు సత్యకు దూరంగా ఉన్న ఆదిత్య ఇపుడు మళ్ళీ తనకి దగ్గరవడంతో సీరియల్ మరింత టెన్షన్ గా మారింది. రుక్మిణి ఏమో ఆదిత్య ఎదురుపడి గుర్తు పట్టినా నేను రుక్మిణి కాదు సత్యని అనడం ఇలా కథ ఇన్ని రకాలుగా మలుపులు తిరుగుతుండడంతో....ఆదిత్య రుక్మిణి కలుస్తారా లేదా...లేక సత్యకి న్యాయం చేయడం కోసం రుక్మిణి మాధవ భార్యగానే మిగిలిపోతుందా అని తెలుసుకోవడానికి క్యూరియాసిటీ  పెరిగిపోతుంది. మెజారిటీ ప్రేక్షకులు ఆదిత్య రుక్మిణి లను ఒక్కటి చేయమని ఆకాంక్షిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కథలో మరో కొత్త మలుపు తీసుకు రావాలని యోచిస్తున్నారట డైరెక్టర్.
సత్య క్యారెక్టర్ ను సైడ్ చేసి ప్రేక్షకుల కోరిక మేరకు రుక్మిని ఆదిత్య లను ఒక్కటి చేయనున్నట్లు ఆ తర్వాత అటు వైపుగా కథను నడిపించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది తెలియాల్సి ఉంది. సీరియల్ అంటేనే రోజుకో విధంగా మలుపులు తిరుగుతూ ఉంటుంది. అలాంటిది ఈ సీరియల్ రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. అయితే ప్రేక్షకులు మాత్రం త్వరలోనే ఆదిత్య రుక్మిణీలు ఇద్దరూ కలవాలని అనుకుంటున్నారు. మరి కొంతమంది ఏమో అలా జరిగితే ఒక అద్భుతమే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: