టీవీ : మట్టి గాజులు ఫేమ్ పద్మావతి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?
జెమినీ టీవీలో ప్రసారమవుతున్న మట్టి గాజులు హీరోయిన్ పద్మావతి.. తన అందం , అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. 2017 వ సంవత్సరం వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేసిన పద్మావతి, ఆ తర్వాత సీరియల్స్ లో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఇక పద్మావతి అసలు పేరు ప్రగతి. ఈమె కర్ణాటకలోని బెంగుళూరులో జన్మించింది. ప్రగతి తండ్రి పేరు చంద్ర..ఈయన వ్యాపారం చేస్తుంటారు. ఈమె తల్లి హేమకళ .. కన్నడలో తన నటనతో మంచి ఆదరణ పొందింది. ఇక ప్రగతి తల్లి యాక్టర్ కావడంతో ప్రగతికి కూడా యాక్టర్ అవ్వాలనే కోరిక తన చిన్నప్పటి వయసు నుంచీ ఉంది. దాంతో ఆమె 1వ తరగతిలో ఉండగానే సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్టుగా కన్నడ స్మాల్ స్క్రీన్ పై నటించింది.
అంత చిన్న వయసులోనే స్మాల్ స్క్రీన్ పై అడుగుపెట్టడంతో స్కూల్ డేస్ తో పాటు కాలేజ్ డేస్ కూడా మిస్సయ్యానని చెప్పింది. ప్రస్తుతం ఇంటర్ ప్రయివేట్ గా చదువుతున్నట్లు సమాచారం . అరసి సీరియల్ ద్వారా ఈమె యాక్టింగ్ కి మంచి గుర్తింపు రావడంతో , కన్నడ మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సీరియల్ లో ప్రగతి యాక్టింగ్ చూసిన భావన కుమార్ .. తెలుగులో జెమినీ టీవీలో మట్టిగాజులు సీరియల్ లో ఛాన్స్ ఇచ్చాడు. ఇక అయితే ప్రగతి నెగెటివ్ షేడ్ లో యాక్ట్ చేయాలని ఉందని చెప్పింది.