బిగ్ బాస్ అంటేనే గొడవలు కొట్లాటలు, లవ్ ట్రాక్ లు ఈ ఫార్ములాతోనే బిగ్ బాస్ సీజన్లన్నీ సూపర్ హిట్ అవుతుంటాయి. ఇక ప్రతీ సీజన్ లోనూ లవ్ ట్రాక్ లు కామన్.. అది హిందీ అయినా తెలుగు బిగ్ బాస్ అయినా లవ్ ట్రాక్ లు లేకపోతే ఆ షో చూసేందుకు ప్రేక్షకులు కూడా ఇష్టపడరు. అంతే కాకుండా ముఖ్యంగా బిగ్ బాస్ టీనేజర్లు ఎక్కువగా చూస్తుంటారు కాబట్టి ఆ మాత్రం ఉండాల్సిందే. ఇక ఇప్పటికే బిగ్ బాస్ సీజన్5 ప్రారంభం కాగా గొడవలు ఏడుపులు నవ్వులు మొదలయ్యాయి. దాంతో రొమాన్స్ ను ఇష్టపడే ప్రేక్షకులు లవ్ ట్రాక్ లు ఎప్పుడు మొదలవుతాయా అని ఎదురుచూస్తున్నారు. కాగా వారి ఆశలు కూడా త్వరలోనే నెరవేరబోతున్నట్టు కనిపిస్తోంది. లవ్ ట్రాక్ లు మొదలు పెట్టేందుకే హౌస్ మేట్స్ కూడా ప్లాన్ లు వేస్తున్నట్టు కనిపిస్తోంది.
తాజాగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో ప్రియాంక సింగ్ లోబో మధ్య జరిగిన సంభాషణనే లవ్ ట్రాక్ మొదలవుతోందన్న సంకేతాలనిస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో లోబో యాంకర్ రవి వాష్ రూమ్ క్లీన్ చేస్తుండగా అదే సమయంలో ప్రియాంక సింగ్ కూడా అక్కడకు చేరుకుంది. ప్రియాంక క్యూట్ నెస్ కు ఫిదా అయిన లోబో ఐలవ్ యూ అంటూ ప్రపోజ్ చేశాడు. అయితే ప్రియాంక మాత్రం లోబోకు నో చెప్పి తన మనసులోని మాటను బయటపెట్టింది. లోబోను తనకు మానస్ ముందు లైన్ వేయాలని ప్రియాంక సూచించింది.
అంతే కాకుండా దమ్ముంటే తనకు మానస్ ముందు లైన్ వేయాలంటూ ప్రియాంక సింగ్ చెప్పడంతో లోబో షాక్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరవాత ప్రియాంక సింగ్ ప్రతి మేల్ కంటెస్టెంట్ ను అన్నా...తమ్ముడూ అనే పిలుస్తుంది. కానీ మానస్ ను మాత్రం బ్రదర్ అని పిలవడం లేదు. ఇదే విషయాన్ని యాంకర్ రవి కూడా ఓ సారి ప్రస్తావించాడు. ఇక ఇప్పుడు ప్రియాంక సింగ్ తనకు మానస్ ముందు లైన్ వేయాలంటూ లోబోకు సవాల్ చేసింది. దాంతో మరికొద్ది రోజుల్లో మానస్ మరియు ప్రియాంక సింగ్ ల ట్రాక్ బిగ్ బాస్ లో కనిపించబోతుందనే చర్చ నెట్టింట జోరుగా వినిపిస్తోంది.