బిగ్ బాస్ లో గొడవలు ఎంత వరకు దారితీస్తాయో..?

Divya
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఇటీవల మూడవ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఇకపోతే ప్రోమో లో లోబో- సిరి, ఆని మాస్టర్ ఇంకా జేస్సీలు బాగా గొడవ పడినట్లు చూపించారు. ప్రేక్షకులు ఈ రోజు బిగ్ బాస్ రచ్చరచ్చే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్లో అనుకున్నట్లుగానే గొడవలు మొదలయ్యాయి. ఇక పవర్ రూమ్ కి సంబంధించిన టాస్క్ మొదలవడంతో, బిగ్ బాస్ చెప్పిన ప్రకారం మొదట విశ్వ పవర్ రూమ్ లోకి వెళ్ళాడు. బిగ్బాస్ చెప్పినట్టుగానే అక్కడ ఇద్దరు డ్రస్ లను పూర్తిగా షోరూంలో పెట్టాల్సి వచ్చింది. అందులో ఎవరో ఇద్దర్ని సూచించమని బిగ్బాస్ కోరగా, విశ్వ యాంకర్ రవి, ప్రియ డ్రస్ లను ఇంకా వారి వస్తువులను తీసుకోవచ్చు అంటూ విశ్వ చెప్పాడు. దీంతో వీరిద్దరి వస్తువులను తొలగించడం జరిగింది.
రవి నైటీ వేసుకొని కొంత సమయం ఫన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత మానస్ కు అవకాశం రాగా ఆర్జె కాజల్ ను ఎంపిక చేసుకోవడం జరిగింది. మానస్ నిద్రపోయిన తర్వాతనే కాజల్ నిద్రపోవాలని చెప్పడంతో కాజల్ సరై అని చెప్పింది. ఇక గొడవల విషయానికి వస్తే కాజల్ మరియు లహరి ల మధ్య చిన్న చిన్న గొడవ మొదలై, అది కాస్త పెద్ద గొడవ గా మారింది.. ఇక కాజల్ మాట్లాడుతూ.. ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు ఉంటే వెంటనే క్లోజ్ చేసేద్దాం అని చెప్పడంతో, లహరి కూర్చుని మాట్లాడితే ఇదంతా కుదరదు అంటూ చెప్పేసింది.. ఆ తర్వాత వీరిద్దరి మధ్య కిచెన్ వర్క్ గురించి గొడవ రావడం, కాస్త సీరియస్ అవ్వడం మనం ఈరోజు ఎపిసోడ్ లో చూడవచ్చు.
ఇక లోబో - సిరి ల విషయానికి వస్తే ,ఇద్దరు మొదట అనుకుని గొడవ పడ్డారు.. వీరు ఫ్రాంక్ చేద్దామనుకుని అది కాస్త వ్రాంగ్ అయినట్లు తెలుస్తోంది. ఇక జస్వంత్ - ఆనీ మాస్టర్ గొడవ  విషయానికి వస్తే.. జెస్సీ ఒక సీటు పై కూర్చొని ,తన కాళ్లను ఇంకో సీటు పై ఉంచాడు. అప్పటికే అక్కడికి ఆనీ మాస్టర్ రావడంతో అతడు కాస్త కొంచెం సీరియస్ గా ప్రవర్తించాడు. వీరిద్దరి మధ్య గొడవ చాలా పెద్దది అయింది.. మిగతావాళ్ళు చెప్పినా కూడా అది చాలా తీవ్రంగా గొడవకు దిగిందని చెప్పాలి.. మొత్తానికి ఎపిసోడ్ మొత్తం రచ్చ రచ్చ అయ్యేలాగా ఉందంటున్నారు బిగ్బాస్ ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: