బిగ్ బాస్ షో అంటే గొడవలు కొట్లాటలకు కేరాఫ్ అడ్రస్. ప్రతి సీజన్ లోనూ గొడలవు జరగటం కామన్. అసలు ప్రేక్షలు షో చూసేదే వాళ్ల గొడవలు..రొమాన్స్ కోసం. అయితే బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం అయిన రెండో రోజే హౌస్ లో గొడవలు జరగటం ఆశ్చర్యకరం. నామినేషన్ సమయంలో ఇంటి సభ్యులు జెస్సీ, హమిదా మరియు విశ్వలు గొడవ పెట్టుకున్నారు. ఇదిలా ఉండగానే ఈరోజు వచ్చిన ప్రోమో మరింత రచ్చరచ్చగా ఉంది. ఏకంగా ముఖం పగిలిపోతుందంటూ ఇంటి సభ్యులు వార్నింగ్ లు ఇచ్చుకున్నారు. ఈ సారి బిగ్ బాస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ లో అందరినీ నవ్వించే కంటెస్టెంట్ లోబో. అతడి వేషం తోనూ మరియు అతడి చేస్టలతోనూ లోబో అందరినీ నవ్విస్తున్నాడు.
అయితే లోబోకు సిరి హన్మంత్ కు మధ్య ఏదో ఇష్యూ జరిగినట్టు కనిపిస్తుంది. ఆ విషయాన్ని కాస్తా సిరి వెళ్లి ఇంటిసభ్యులతో చర్చిస్తుంది. అదే సమయంలో అక్కడికి లోబో ఎంట్రీ ఇచ్చాడు. ఏదైనా ఉంటే తనతో చెప్పాలని అక్కడిక్కడ చెప్పకూడదని లోబో వ్యాక్యానించాడు. దాంతో లోబోను సిరి వెంటనే తీసిపారేసింది. తనను గెలికితే ఇలానే ఉంటుందని చెప్పింది. దాంతో కోపానికి గురైన గెలకడానికి ఎవడూ ఖాళీగా లేడని ముఖం అద్దంలో చూసుకోవాలని అంటూ అరిచాడు. దాంతో ముఖం గికం అంటే మఖం పగిలిపోద్దంటూ సిరి హన్మంత్ లోబోకు వార్నింగ్ ఇచ్చింది.
దాంతో లోబో నా ముందు చెటాక్ అంత ఉన్నావ్ అంటూ మండిపడ్డారు. వీరి గొడవ ఇలా ఉంటే ఆర్జే కాజల్, లహరి మధ్య కూడా మాటల యుద్దం జరింగింది. కాజల్ ను చూస్తూ ఎందుకంత హైపర్ అవుతున్నావ్ అంటూ లహరి కాజల్ ను ప్రశ్నించింది. దాంతో కాజల్ మళ్లీ ఏడుపు మొదలు పెట్టింది. నిన్న నామినేషన్ సమయంలో కాజల్ ఇప్పటికే బిగ్ బాస్ ను నమిలి మింగేసిందని ఆమెకు షో గురించి పూర్తిగా తెలుసునని అంతా అనడం నామినేట్ చేయడంతో...చిన్నప్పటి నుండి తాను బిగ్ బాస్ చూస్తున్నానని తనకు నచ్చిన షోలో ఉండటంతోనే ఎక్సైట్ అయ్యానని బోరున ఏడ్చేసింది. ఇక ఈ రోజు ప్రోమో చూస్తుంటే మరింత మసాలా ఉందని అర్థం అవుతోంది.