బిసిసిఐ షాకింగ్ నిర్ణయం.. పురుషుల క్రికెట్లో మహిళ ఎంపైర్లు?
ప్రపంచ క్రికెట్లో ఇక బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఎంతో సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇలా అంతర్జాతీయ క్రికెట్లో మహిళల ప్రాముఖ్యతను పెంచే విధంగా ఇక మరిన్ని నిర్ణయాలు తీసుకునేందుకు ముందు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే సంచలన నిర్ణయానికి బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పురుషుల క్రికెట్లో మహిళ కామెంటెటర్లను తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పురుషుల క్రికెట్లో మహిళ అంపైర్లకు కూడా అవకాశం కల్పించబోతున్నారు అన్నది తెలుస్తుంది.
పురుషుల క్రికెట్లో మహిళల భాగస్వామ్యం పెంచేందుకే బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. త్వరలో ప్రారంభం కాబోతున్న రంజీ ట్రోఫీలో ఉమన్ ఎంపైర్లు మైదానంలో కనిపించబోతున్నారట. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలియజేశారు. రానున్న రోజులలో అంతర్జాతీయ క్రికెట్లోనూ ఇక మహిళ ఎంపైర్లు కనిపించే అవకాశం ఉందని బిసిసిఐ అధికారి చెప్పుకొచ్చారు. కాగా భారత క్రికెట్లో వృందారతి, గాయత్రి, జనని మహిళ అంపైర్లు గా ఉన్నారు.