నా ముందున్న లక్ష్యం అదొక్కటే : కోహ్లీ
అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అటు భారత జట్టు ఐసీసీ ట్రోఫీ గెలవక పోయినప్పటికీ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు రావడంతో టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోగా ఆతర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి కూడా అతని తప్పించారు. చివరికి టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకొని పూర్తిగా సారథ్య బాధ్యతలు దూరమయ్యాడు విరాట్ కోహ్లీ. మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విరాట్ కోహ్లీ. టీమిండియాకు ఆసియా కప్ తో పాటు టీ20 ప్రపంచ కప్ అందించడమే నా టార్గెట్ అంటూ చెప్పుకొచ్చాడు.
దీని కోసం తనకు సాధ్యమైనంత కష్టపడటానికి ప్రయత్నిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయంలో ఎంతో సమతూకంగా ముందుకు సాగాలి అంటూ కోహ్లీ తెలిపాడు. ఇందుకోసం కొంత విరామం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి నేను కుదుర్చుకునీ సెట్ అయితే మాత్రం ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా భారత జట్టుకు ఐసీసీ ట్రోఫీలు అందించడానికి ఏం చేయడానికైనా సిద్ధమే అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ ఏడాది టి20 వరల్డ్ కప్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే..