చెన్నై ఆశలపై నీళ్లు చల్లిన ముంబై... ఐపిఎల్ నుండి ఔట్!
అప్పటి నుండి చెన్నై కోలుకోలేకపోయింది.. కానీ కెప్టెన్ ధోని 36 పరుగుల పుణ్యమా అని చివరికి 97 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయింది. ముంబై బౌలర్లలో శామ్స్ 3, మెరెడిత్ 2 మరియు కుమార్ కార్తికేయ 2 వికెట్లు దక్కించుకున్నారు. అయితే చేధనలో ముంబై కూడా ఒక దశలో తడబడింది. కేవలం 33 పరుగులకు ముంబై ప్రధాన బ్యాట్స్మన్ అందరూ ఔట్ అయ్యారు. ఈ దశలో యువ ఆటగాడు తిలక్ వర్మ కాసేపు షోకీన్ మరియు టీమ్ డేవిడ్ లతో కలిసి ముంబైను విజయ తీరాలకు చేర్చాడు. ముంబై 14.5 ఓవర్ లలో లక్ష్యాన్ని ఛేదించి చెన్నై ను లీగ్ నుండి ఔట్ అయ్యేలా చేసింది.
ఈ ఓటమితో చెన్నై 12 మ్యాచ్ లలో 4 గెలిచి 8 ఓడిపోయింది. కాబట్టి ఇక ఎటువంటి పరిస్థితులలో చెన్నై కు ప్లే ఆఫ్ రేస్ కు ఎటువంటి సంబంధం లేదు. ముంబై పోతూ పోతూ తమతో పాటు చెన్నై ను తీసుకెళుతుంది. ఇంకా ప్లే ఆఫ్ రేస్ లో 7 జట్లు ఉన్నాయి. ఇక మ్యాచ్ లో జరిగే కొద్దీ మిగిలిన జట్లపై ఒక క్లారిటీ వస్తుంది.