ఇండియాలో కాదు, యూఏఈలో కాదు.. ఐపీఎల్ ఎక్కడంటే?
కానీ ప్రస్తుతం భారత్లో కరోనా వైరస్ కేసులు పెరిగి పోతూ ఉండటం చూస్తూ ఉంటే ఇక రానున్న రోజుల్లో భారత్ లో ఐపీఎల్ నిర్వహించడం కష్టతరం అయ్యే అవకాశం ఉంది అని ఎంతో మంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకవేళ ఇండియాలో కుదరకపోతే ఎప్పటిలాగానే యూఏఈ వేదికగా బిసిసిఐ ఐపీఎల్ నిర్వహించబోతోంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా మరో రెండు వేదికలు తెర మీదికి రావడం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో అసలు ఐపిఎల్ ఎక్కడ నిర్వహించబోతున్నారు అన్న చర్చ మొదలయింది.
అయితే మునుపటిలా యూఏఈ వేదికగా కాకుండా ఈసారి దక్షిణాఫ్రికా లేదా శ్రీలంక వేదికగా ఐపీఎల్ 2022 సీజన్ నిర్వహించే అవకాశం ఉంది అని ఇక ఈ రెండు వేదికలను కూడా పరిశీలిస్తున్నామని అంటూ ఇటీవల బీసీసీఐ అధికారి ఒకరు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రతిసారీ ఐపీఎల్ను యూఏఈలో నిర్వహించడం కుదరక పోవచ్చు. అందుకే ఇతర దేశాల్లో పరిస్థితులపై కూడా బిసిసీఐ అధ్యయనం చేస్తుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. భారత్ లోనే ఐపీఎల్ నిర్వహించాలని ముందుగా బిసిసిఐ భావించినప్పటికీ.. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య.. ఇక ఇతర దేశాలలో వేదికలపై కూడా బిసిసిఐ దృష్టిసారిస్తోంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.