అంపైర్ కు గ్రౌండ్ లోనే కోహ్లీ వార్నింగ్ !

Veldandi Saikiran
దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు లో ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్‌ తో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ గొడవ‌కి దిగాడు. మ్యాచ్‌‌లో రెండో రోజైన బుధవారం టీమిం డియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ బౌలింగ్ చేస్తుండగా.. పిచ్ డేంజర్ ఏరియా లోకి వెళ్తున్నావు అంటూ అతనికి అంపైర్ ఎరాస్మస్ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో.. రంగంలోకి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మహ్మద్ షమీకి సపోర్ట్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో.. ఎరాస్మస్, కోహ్లీ మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.మహ్మద్ షమీ బౌలింగ్ సమయంలో బంతిని విసిరిన తర్వాత అలానే  నడుచుకుంటూ క్రీజు వెలుపల ఉన్న పిచ్ డేంజర్ ఏరియాలోకి వెళ్తున్నాడని ఎరాస్మస్ ఆరోపించాడు. ఈ క్రమంలో ఒక అఫిషియల్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. కానీ.. షమీ మాత్రం తాను డేంజర్ ఏరియాలో అడుగు పెట్టలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా.. ఎరాస్మస్ వినలేదు. దాంతో.. విరాట్ కో హ్లీ చొరవ తీసుకుని షమీకి సపోర్ట్‌ గా నిలిచాడు.
షమీ అసలు డేంజర్ ఏరియాలో అడుగు పెట్టలేదంటూ గట్టిగా వాదిస్తూ.. అంపైర్‌కి మాటకి మాట బదులిచ్చాడు. కోహ్లీ, ఎరాస్మస్ మధ్య వాగ్వాదం తర్వాత మహ్మద్ షమీ బౌలింగ్ చేసిన తీరుపై రిప్లైని పరిశీలించగా.. షమీ పిచ్ డేంజర్ ఏరియాకి వెలుపలే అడుగులు పెడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. దాంతో.. ఈ రిప్లైని స్టేడియం‌లోని బిగ్ స్క్రీన్స్‌పై చూసిన కోహ్లీ.. మరోసారి అంపైర్ ఎరాస్మస్‌ వైపు చూస్తూ సైగలు చేశాడు. పిచ్ డేంజర్ ఏరియాలో ఆటగాళ్ల పాద ముద్రలు పడితే? అది స్పిన్నర్లకి అనుకూలించనుంది. అంపైర్ అఫిషియల్ వార్నింగ్ తర్వాత కూడా ఫీల్డింగ్ టీమ్ అదే తప్పిదానికి పాల్పడితే? ఆ జట్టుకి 5 పరుగుల జరిమానా విధిస్తారు. ఒకవేళ బ్యాట్స్‌మెన్ ఈ తప్పిదానికి పాల్పడినా 5 పరుగుల జరిమానా తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: