ప్రస్తుతం టీం ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ ఎన్సీఏ అకాడమీలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే సౌతాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్కు వైస్ కెప్టెన్గా ఎంపికైన రోహిత్ శర్మ... ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో సౌతాఫ్రకా పర్యటన మొత్తానికే రోహితశర్మ దూరమయ్యాడు. దీంతో సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు వైస్ కెప్టెన్గా, వన్డే సిరీస్కు కెప్టెన్గా కేఎల్ రా హుల్ ను బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇక తాజాగా రోహిత్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన తన ఫోటో నెట్టింట వైరల్గా మారింది. ఈ ఫోటోలో హిట్మ్యాన్ కొత్త లుక్లో కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలో క్లీన్ షేవ్ చేసుకున్న రోహిత్.. మీసాలను కూడా పూర్తిగా తీసేసి... ఫ్రెష్ లుకులో కనిపిస్తున్నాడు. అలాగే ఎన్సీఏలో బరువు తగ్గేందుకు కృషి చేసిన రోహిత్... అనుకున్నది సాధించినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే... రోహిత్ శర్మ బరువు తగ్గినట్టు ఈ ఫోటోలో అర్థమవుతుంది. దాంతో గతం కన్న భిన్నంగా కెప్టెన్ రోహిత్ శర్మ స్లిమ్గా కనిసిస్తున్నాడు.
అయితే బెంగళూరులోని ఎన్సీఎలో కోలుకుంటున్న సమయంలో బరువు తగ్గాలని... నిపుణులు రోహిత్ కు సూచించడంతో... ఈ విరామ సమయంలో దాని పై దృష్టి సారించి ఫలితం పొందాడు హిట్మ్యాన్. ఇక ఇదిలా ఉంటె... రోహిత్ శర్మ కెప్టెన్సీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా విదేశాల్లో మంచి విజయాలే సాధించినప్పటికీ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయింది. దీంతో ఆ లోటును రోహిత్ శర్మ తీరుస్తాడని అంతా భావిస్తున్నారు. దానికి తగ్గట్టే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్, వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ టోర్నీలు ఉన్నాయి. కాగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ను రికార్డు స్థాయిలో ఐదు సార్లు ఛాంపియన్గా నిలబెట్టిన రోహిత్ శర్మ.. భారత జట్టును కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్తాడు అని భావిస్తున్నారు.