పాక్ క్రికెటర్ కు.. ధోని స్పెషల్ గిఫ్ట్?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచ క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్న మహేంద్రసింగ్ ధోని   ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని క్రేజ్ మాత్రం ఇప్పటికీ ఎక్కడా తగ్గలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతే కాకుండా అటు ప్రపంచ క్రికెట్లోఎంతో మంది యువ ఆటగాళ్లు ధోనీ నుంచి సలహాలు తీసుకోవడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు.. అంతలా తన కెప్టెన్సీలో ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు మహేంద్రసింగ్ ధోని.

 ఒకవైపు అత్యుత్తమ సారధిగా మరోవైపు బ్యాటర్ గా, వికెట్ కీపర్ గా, బెస్ట్ ఫినిషర్ గా క్రికెట్ చరిత్రలోనే తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు. అదే సమయంలో ఇక సహచర ఆటగాళ్లతో ధోని వ్యవహరించే తీరు కూడా ఎంతో మంది ఎంతో మంది అభిమానులకు నచ్చుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. పాకిస్థాన్ ఆటగాడు హరీస్ రావూఫ్ కి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు మహేంద్రసింగ్ ధోని.

 ఇటీవలే తాను సంతకం చేసిన జెర్సీ పాకిస్థాన్ క్రికెటర్ కు పంపించాడు మహేంద్రసింగ్ ధోని. ఇక ఈ విషయాన్ని ఆటోఅటు మీడియా వేదికగా వెల్లడించాడు. దిగ్గజం కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ అందమైన బహుమతిని నాకు పంపించాడు.. తన  తన మంచి మనసుతో నెంబర్ 7 ఇంకా హృదయాలను కొల్లగొడుతున్నారు అంటూ పాకిస్థాన్ క్రికెటర్ ధోని పంపిన జెర్సీ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ధోని పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఇదే విషయంపై స్పందించిన చెన్నై సూపర్ కింగ్స్ మేనేజర్ రాధాకృష్ణన్ మా కెప్టెన్ మాట ఇచ్చాడు అంటే తప్పక నెరవేరుస్తాడని అంటూ చెప్పడం గమనార్హం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: