భారత్ vs కివిస్ : రెండో టెస్ట్లో ఇండియా అఖండ విజయం.. సిరిస్ కైవసం
ఇక రెండో ఇన్నింగ్స్లో 276/7 పరుగులు చేసిన టీమిండియా డిక్లెర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించినా భారత్ బ్యాట్స్మెన్స్ మయాంక్ అగర్వాలు - 150, అక్షర్ పటేల్ - 52 చేసి మంచి ప్రదర్శన కనబరిచారు. అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్ 62 పరుగులకే చేతులెత్తేసి ఆలౌట్ అయింది. ఇంత తక్కువ పరుగులకు ప్రత్యర్థి జట్టును ఒక్క టెస్ట్ మ్యాచ్లో కట్టడి చేయడం ఇదే కావడం విశేషం. భారత బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీసి టాప్ ఆర్డర్ను పడగొట్టగా, స్పిన్నర్ అశ్విన్ 4 వికెట్లు, అక్షర్ 2 వికెట్లు తీసుకోవడం టీమిండియా 263 పరుగలు అధిపత్యాన్ని సాధించింది.
రెండో రోజు మ్యాచ్లో కివిస్ స్వల్ప స్కోరుకే ఆలౌట్ ఫాలోఆన్ చేయాల్సి ఉన్నా.. టీమిండియా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కొనసాగించింది. రెండో ఇన్నింగ్స్లో మయాంక్ అగర్వాల్- 62, పుజారా- 47 కలిసి మొదటి వికెట్కు సెంచరీ పార్ట్నర్షిప్ చేశారు. ఈ ఇద్దరు వెంటవెంటనే ఔటవడంతో శుభ్మన్ గిల్-47 పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కొహ్లీ-36 పరుగులు చేసి రాణించారు. వీళ్లు ఔట్ అయిన తరువాత వచ్చిన శ్రేయస్-14, సాహా-13 పరుగులు చేసి విఫలమయ్యారు. చివర్లో వచ్చిన అక్షర్ పటేల్-41 పరుగులు చేసి టిమిండియాకు 276/7 పరుగులకు చేర్చారు.