IPL 2022 : కొత్త జ‌ట్టు ద‌క్కేది వారికేనా?

Dabbeda Mohan Babu
ఐపీఎల్ 2021 ముగిసి వెంట‌నే ఐపీఎల్ 2022 కు బీసీసీఐ క‌స‌రత్తు చేస్తుంది. అలాగే ఐపీఎల్ 2022 కోసం బీసీసీఐ రెండు కొత్త జ‌ట్ల ను తీసుకువ‌స్తున్న విష‌యం తెలిసిందే. అందు కోసం బీసీసీఐ ఇప్ప‌టికే టెండ‌ర్ల ను ఆహ్వానించింది. అయితే ఐపీఎల్ 2022 లో వ‌స్తున్న రెండు కొత్త జ‌ట్ల ను ద‌క్కించు కోవ‌డానికి అనేక సంస్థ‌లు ముందుకు వచ్చాయి. టెండ‌ర్ల ను కూడా స‌మర్పించాయి. ఇప్ప‌టికే ఆదానీ గ్రూప్, జిందాల్ కంపెనీ, మాంచెస్ట‌ర్ యునైటెడ్ ఓన‌ర్స్ , టొరెంట్ ఫార్మా, అర‌బిందో ఫార్మా, కోట‌క్ గ్రూప్, రోని స్క్రూవాలా, హిందుస్థాన్ టైమ్స్ తో పాటు మొత్తం 11 సంస్థ‌లు టెండ‌ర్ల ను వేశాయి. అలాగే బాలీవుడ్ జంట దీపికా ప‌దుకునే, ర‌ణ్ వీర్ సింగ్ కూడా కొత్త జ‌ట్ల కోసం టెండ‌ర్ల వేశారు.

అయితే కొత్త టీం లు ఆహ్మాదాబాద్, ల‌క్నో నుంచి అవ‌కాశాలు ఎక్కువ గా ఉన్నాయి. అయితే వీటిలో ఆహ్మాదాబాద్ టీం ఆదానీ గ్రూప్ దాదాపు ఖ‌రారు చేసుకున్న‌ట్టు స‌మాచారం. ఈ టీం కోసం ఆదానీ గ్రూప్ ఎక్కువ మొత్తం లో టెండ‌ర్స్ వేసిన‌ట్టు తెలిసింది. అలాగే గ్లేజ‌ర్ కుటుంబానికి చెందిన మాంచేస్ట‌ర్ క్ల‌బ్ కు సొంతం చేసుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం. ఈ రెండు సంస్థ‌లే దాదాపు 7000 నుంచి ప‌ది వేల కోట్ల రూపాయాల వ‌ర‌కు కేటాయిస్తున్నాయ‌ని తెలుస్తుంది. దీంతో ఈ రెండు సంస్థ‌లే కొత్త టీం ల‌ను సొంతం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. అయితే టెండ‌ర్ల తుది ఫ‌లితాలను ఈ రోజు సాయంత్రం బీసీసీఐ విడుద‌ల చేస్తుంది. దీంతో కొద్ది సేప‌ట్లో ఈ రెండు కొత్త జ‌ట్ల ను ఏ ఏ సంస్థ‌లు దక్కించు కున్నాయో తెలుస్తుంది. అయితే బీసీసీఐ కూడా ఆట‌గాళ్ల వేలం వేసే యాక్ష‌న్ కోసం స‌ర్వ సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఫోటో ల‌ను కూడా ట్వీట్ట‌ర్ ద్వారా పంచు కుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: