భారత్ కు షాక్... వికెట్ కోల్పోకుండా పాక్ విజయం
ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ 52 బంతుల్లో 68 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ 55 బంతుల్లో 79 పరుగులు చేశాడు. దాంతో 17.5 ఓవర్లలోనే పాకిస్తాన్ జట్టు భారత జట్టు నిర్ధేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో ఐసిసి టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టుపై మొదటిసారిగా విజయం సాధించింది ప్రత్యర్థి పాకిస్తాన్. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన కారణంగా మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో కేవలం 151 పరుగులు చేసి ఏడు వికెట్ల చేజార్చుకుంది. అయితే భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడే 57 పరుగులతో రాణించాగా పంత్ 39 పరుగులతో కోహ్లీ కి అండగా నిలిచాడు. కానీ మిగిలిన వారు ఎవరు అంతగా ఆకట్టుకోలేదు. ధనతో భారత్ తక్కువ టార్గెట్ నే పాక్ కు ఇచ్చింది.