T20 WORLD CUP: వీళ్ల‌కు గుక్కెడు నీళ్లు కూడా దిగ‌డం లేదే..!

VUYYURU SUBHASH
ప్ర‌తి భార‌తీయ క్రికెట్ అభిమానికి ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఈ రోజు ముగిసే వ‌ర‌కు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. బీపీ మిషన్లు బద్దలయిపోయేలా వీరి పరిస్థితి. ఈ రోజు టీ 20 ప్రపంచ క‌ప్ క్రికెట్ టోర్న మెంట్లో భాగంగా భార‌త్ - పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ కోసం దేశ వ్యాప్తంగా నే ఉన్న కోట్లా ది మంత్రి క్రికె ట్ అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు.

ఎవ్వ‌రికి కూడా కూర్చోబుద్ధి కాదు. నిల్చోబుద్ధి కాదు... మ్యాచ్ స్టార్ట్ అయ్యి ఫలితం తేలే వరకూ గుక్కె డు నీళ్లు కూడా మింగ బుద్ధి కాదు. పాకిస్థాన్, ఇండియా టీ 20 మ్యాచ్ కు రంగం అంతా సిద్దమయింది. దుబాయ్ లో ఈరోజు రాత్రి 7. 30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. స‌హ‌జంగానే భార‌త్ - పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ అంటే రెండు దేశాల క్రికెట్ ప్రియుల‌కు ఎంత ఆస‌క్తి ఉంటుందో తెలిసిందే. అయితే ఈ సారి ప్రపంచ‌క‌ప్ ... అది కూడా టీ 20 మ్యాచ్ కావ‌డంతో మ‌రింత ఉత్కంఠ ఉంది.

ఎందుకంటే ఈ మ్యాచ్‌లో విన్న‌ర్ ఎవ‌రు అనేది కేవ‌లం 3 గంట‌ల్లో డిసైడ్ అవుతుంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు టీ 20 ప్రపంచ కప్ మ్యాచ్ లలో భారత్  – పాక్ ల మధ్య ఐదు మ్యాచ్ లు జరిగితే అన్ని సార్లు భార‌త్  నే విజ‌యం వ‌రించింది. ఈ సారి కూడా మ్యాచ్ లో భార‌త్ జ‌ట్టే పేవ‌రెట్ గా బ‌రిలోకి దిగుతోంది. ఇక మెంటార్ కూడా సీనియ‌ర్ ధోనీ ఉన్నారు. అయితే పాకిస్తాన్ ను కూడా ఏ మాత్రం త‌క్కు వ అంచ‌నా వేయ‌లేం. ఆ జ‌ట్టు ఎప్పుడు అయినా సంచ‌ల‌నాల కు రెడీ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

T20

సంబంధిత వార్తలు: