విండీస్ పై ఇంగ్లాండ్ సునాయాస విజయం...
ఇక ఆతర్వాత 56 పరుగుల అతి స్వల్ప లక్ష్యంతో వచ్చిన ఇంగ్లాండ్ జట్టు మంచిగానే ఆరంభించింది. అయితే ఆ జట్టు ఓపెనర్ జాసన్ రాయ్ 10 బంతుల్లో 11 పరుగులు చేసి ఔట్ అయిన తర్వాత వచ్చిన ఆటగాళ్ళు జానీ బెయిర్స్టో 9 పరుగులు, మోయిన్ అలీ 3 పరుగులు, లామ్ లివింగ్ స్టోన్ ఒక పరుగు చేసి వెంట వెంటనే ఔట్ అయ్యారు. ఈ క్రమంలోనే మరో ఓపెనర్ జొస్ బట్లర్ 22 బంతుల్లో 24 పరుగులు చేయగా... కెప్టెన్ మోర్గాన్ 7 బంతుల్లో 7 పరుగులు చేయడంతో 8.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది ఇంగ్లండ్ జట్టు.
అయితే ఇంగ్లాండ్ జట్టు ఈ టోర్నీని అద్భుతమైన విజయంతో ఆరంభించిన వెస్టిండీస్ జట్టు చాలా దారుణమైన ఓటమితో ప్రారంభించింది అనే చెప్పాలి. అయితే వెస్టిండీస్ జట్టుకు ఇది టీ-20 ఫార్మెట్లో రెండవ అతి తక్కువ స్కోరు. మొదటిది కూడా 2019లో ఇంగ్లాండ్ జట్టుకు వ్యతిరేకంగానే 45 పరుగులకు ఆలౌటైంది వెస్టిండీస్.