భారత్తో పోటీ పడటానికి పాకిస్థాన్లో ఆటగాళ్లు లేరు...
ఇక టీ 20 అనేది ఎవరైనా పరుగులు చేయగల ఫార్మాట్. నేను 1998 లో అనిల్ కుంబ్లే ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసినప్పుడు, పాకిస్థాన్లో ఇంజామామ్-ఉల్-హక్, సయీద్ అన్వర్, సలీం మాలిక్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ మరియు సక్లైన్ ముస్తాక్ వంటి బ్యాట్స్మన్లు ఉన్నారు. ఈ రోజు పాకిస్తాన్ భారతదేశంతో పోటీ పడటం కనిపించడం లేదు ఎందుకంటే వారి జట్టులో ఆ స్థాయి ఆటగాళ్లు ఒకరు లేదా ఇద్దరు ఉండవచ్చు. నిజంగా భారత్ ను ఓడించగల జట్లు ఇంగ్లాండ్ లేదా ఆస్ట్రేలియా అని హర్భజన్ ఆయన అన్నారు. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎంత నష్టాల్లో నడుస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఐసిసి నిధులను బట్టి బోర్డు నడపాల్సి ఉంటుందని ఉంటుందని పిసిబి అధ్యక్షుడు రమీజ్ రాజా ఇటీవల ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఆ ఐసీసీనే బీసీసీఐ పై ఆధారపడి ఉంది అని కూడా చెప్పాడు.