కొత్త ఐపీఎల్ టీం కోసం హీరో, హీరోయిన్ బిడ్ ..?
వచ్చే 10 ఏళ్ల పాటు ఈ రెండు జట్ల ఓనర్ షిఫ్ను దక్కించుకునే క్రమంలో వీటి విలువ కోట్లలో ఉంటుదని అంచనా వేస్తున్నారు. పదేళ్లకు వీటి విలువ రు. 8 వేల కోట్లు ఉంటుందని చెపుతున్నారు. ఈ రెండు ఐపీఎల్ జట్ల ఓనర్ షిఫ్ దక్కించుకునేందుకు అనేక మంది బడా బడా పారిశ్రామిక వేత్తలు , సెలబ్రిటీలు పోటీ లో ఉన్నారు. దీంతో ఈ జట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ టీంను దక్కించు కునేందుకు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, అతడి భార్య హీరోయిన్ దీపికా పదుకోన్ ఓ బిడ్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. అయితే వీరు సింగిల్ గానే బిడ్ వేశారా ? లేదా మరెవరితో అయినా కలిసి బిడ్ దాఖలు చేశారా ? అన్నది మాత్రం తెలియలేదు. ఇప్పటికే బాలీవుడ్ కు చెందిన షారుక్ కు కోల్కత్తా, పంజాబ్ లో ప్రితిజింతాకు వాటాలు ఉన్నాయి. ఇక గతంలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా రాజస్తాన్ రాయల్స్కు వాటాదారులు.