టీ 20 ప్రపంచకప్లో పాకిస్తాన్పై గెలుపు భారత్దే.. సెంటిమెంట్ రిపీట్..!
1 - తొలి వరల్డ్ టీ20 టోర్నీలో డర్బన్ లో 2007 సెప్టెంబరు 14 న జరిగిన మ్యాచ్లో భారత్ గెలిచింది. మ్యాచ్ టై అయ్యింది. అయితే బౌల్ అవుట్లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించి గెలుపు బావుటా ఎగరవేసింది. అప్పుడు సూపర్ ఓవర్ లేదు.
2- అదే వరల్డ్ కప్లో ఫైనల్లో మరోసారి ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఫైనల్లో దాయాది అయిన ప్రత్యర్థిపై 5 పరుగుల తేడాతో విజయం సాధించి మొదటి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలు చు కుంది.
3- ఆ తర్వాత కొలంబోలో జరిగిన టీ 20 ప్రపంచ కప్ మ్యాచ్లో 128 పరుగులకే ప్రత్యర్థి జట్టును కట్టడి చేసిన భారత్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి.. మూడు ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ తీయడం మరో విశేషం.
4- ఆ తర్వాత ఢాకాలో జరిగిన వన్ సైడ్ మ్యాచ్లో భారత బౌలర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో 130 పరుగులకే పాక్ చేతులు ఎత్తేసింది. ఆ తర్వాత భారత్ సులువుగా గెలిచింది.
5- ఆ తర్వాత మన దేశంలో జరిగిన టీ 20 ప్రపంచ కప్లో సూపర్-10 గ్రూపు-2లో భాగంగా కోల్కతాలో జరిగిన ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్లతో గెలిచింది. ఈ మ్యాచ్ లో పాక్ 118 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది.
6- ఇక ఇప్పుడు ఐదేళ్ల విరామం తర్వాత కోహ్లి సారథ్యంలోని మన జట్టు దుబాయ్ వేదికగా ఆరో సారి టీ 20 ప్రపంచకప్లో పాకిస్తాన్తో తలపడ బోతోంది.