Rcb జెర్సీ కావాలా.. సొంతం చేసుకోండి ఇలా?

praveen
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా కెప్టెన్గా కొనసాగుతూ ఉండటం గమనార్హం. అయితే ఇప్పటి వరకు ఈ జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలిచింది లేదు. కానీ ప్రతిసారి ఐపీఎల్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతూ ఉంటుంది. కానీ చివరికి ప్రేక్షకులను నిరాశ పరుస్తూనే ఉంటుంది. అయితే ఇక ఈ ఐపీఎల్ సీజన్లో మాత్రం ఎంతో దూకుడుగా ఆడుతుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.

 ఇకపోతే సాధారణంగా క్రికెట్ ఆటగాళ్ల జెర్సీ ని సొంతం చేసుకోవాలని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. ఇలాంటి అదృష్టం వస్తే అస్సలు మిస్ చేసుకోరు. అయితే ఇప్పుడు ఇలాంటి ఒక అదృష్టమే వేచి చూస్తుంది.  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు జెర్సీ సొంతం చేసుకునే అవకాశం మీ కోసం సిద్ధంగా ఉంది.  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అప్పుడప్పుడు సమాజ హితం కోసం కొన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే  దేశంలో పచ్చదనాన్ని పెంపొందించాలానే ఉద్దేశంతో ఆకుపచ్చ రంగు జెర్సీ వేసుకుని ప్రతి ఏడాది ఐపీఎల్లో ఒక మ్యాచ్ ఆడుతూ ఉంటుంది ఆర్ సి బి. ఇటీవలే కరోనా వారియర్స్ కి గుర్తుగా పి పి ఈ కిట్ రంగు అయిన నీలిరంగులో జెర్సీ వేసుకొని ఒక మ్యాచ్ ఆడేందుకు సిద్దం అయింది.

 ఇక ఇప్పుడు మరో గొప్ప పనికి సిద్ధమైంది ఆర్సిబి జట్టు. వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్లి లేని నిరుపేదలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయించేందుకు ఆర్సిబి యాజమాన్యం తమ ఆటగాళ్ల జెర్సీలను వేలం వేసేందుకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ వేలం పాట కొనసాగుతుంది అంటూ ఇటీవల స్పష్టం చేసింది ఇక వేలంలో విజేతలుగా నిలిచిన వారు తమ అభిమాన ఆటగాళ్ళ ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీ లను సొంతం చేసుకోవచ్చు అంటూ తెలిపింది. Fankind.Ord/rcb లో పూర్తి వివరాలు ఉంటాయి అంటూ తెలిపింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: