పాకిస్తాన్ కి క్రిస్ గేల్ మద్దతు.. నెటిజన్ల సెటైర్లు?

praveen
సాధారణంగా అన్ని దేశాల జట్లు కూడా విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ వుంటాయి.  విదేశీ పర్యటనకు వెళ్లి ఆతిథ్య జట్టుపై విజయం సాధించాలి అని ఎంతో కసితో ఉంటాయి.  ఇలా అన్ని జట్లు కూడా వివిధ దేశాలలో పర్యటనకు వెళ్లడం చూస్తాం  కానీ అటు పాకిస్థాన్ పర్యటనకు వెల్లెందుకు మాత్రం అన్ని చెట్లూ భయపడిపోతుంటాయ్ అన్న విషయం తెలిసిందే.  దీనికి కారణం పాకిస్థాన్లో రక్షణ లేకపోవడం అక్కడ ఉగ్రవాదులు రెచ్చిపోయి క్రికెటర్లపై దాడి చేసిన ఘటనలు గతంలో ఎన్నో ఉన్నాయి.

 ఈ క్రమంలోనే అటు భారత్-పాకిస్థాన్ లో మ్యాచ్ లను పూర్తిగా రద్దు చేసుకుంది. కేవలం వరల్డ్ కప్ లో తప్ప ఇంకా ఎక్కడా పాకిస్తాన్ భారత్ మ్యాచ్ జరగదు.  కేవలం భారత్ మాత్రమే కాదు మిగతా దేశాల జట్లు కూడా పాకిస్తాన్లో పర్యటించడానికి కాస్త వెనకడుగు వేస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇటీవలే న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్లో పర్యటించాల్సి ఉన్నప్పటికీ ఇక చివరి నిమిషంలో తమ పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.  భద్రతా సమస్యల కారణంగా పాకిస్థాన్తో సిరీస్ ను రద్దు చేసుకుంటున్నట్లు ఇటీవల న్యూజిలాండ్ తెలిపింది.

 ఇలాంటి సమయంలో అటు క్రిస్ గేల్ మాత్రం పాకిస్తాన్కు మద్దతు ప్రకటిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. రేపు నేను పాకిస్తాన్ వెళ్తున్నాను నాతో ఎవరైనా వస్తారా అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు క్రిస్ గేల్. ఇక ఈ పోస్ట్ పై స్పందించిన పాకిస్థాన్ బౌలర్ అహ్మద్ అమిర్ అక్కడ కలుద్దాం లెజెండ్ అంటూ కామెంట్ పెట్టాడు.  ఈ పోస్ట్ పై అటు నెటిజన్లు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు నువ్వు ఆడుతుంది భారత్లో ఉన్న పంజాబ్ జట్టు తరపున పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ లో కాదు. అది మర్చిపోయినట్టు ఉన్నావ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: