రోహిత్ వద్దు.. రాహుల్ లేదా పంత్ ఓకే - కోహ్లి?
ఇది ఇలా ఉండగా కోహ్లి అంతర్జాతీయ టీ 20 లకు వీడ్కొల్ పలకడంతో తర్వాత కెప్టెన్ గా ఎవరు ఉంటారని ఉత్కఠం ప్రతి క్రికెట్ అభిమానికి నెలకొంది. అయితే ఇప్పటి వరకు అంతర్జాతీయ ట్వంటీ ట్వంటి లకు వైస్ కెప్టెన్ గా ఉన్న హిట్ మెన్ రోహిత్ శర్మ కు తప్పని సరిగా ప్రమోషన్ వచ్చినట్టే అని అనుకున్నారు. దాదాపు హిట్ మెనే అంతర్జాతీయ టీ 20 లకు కెప్టెన్ అనుకున్నారు. అంతే కాకుండా హిట్ మ్యాన్ అభిమానులు సైతం సంబురాలు చేసుకున్నారు. అయితే రోహిత్ వయస్సు ఈ నిర్ణయానికి అడ్డు పడేలా ఉంది. ప్రస్తుతం రో హిత్ వయస్సు దాదాపు గా 36 ఉంటుంది. ఇంకా మూడు నుంచి నాలుగు సంవత్సరాలు మాత్రమే టీమిండియా కు ఆడే ఆవకాశాలు ఉన్నాయి. దీంతో రోహిత్ శర్మ ను కెప్టెన్ గా ఎంచుకోవాడానికి అవకాశం తక్కవ అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
అలాగే టీమిండియా మేనేజ్ మెంట్ కు కోన్ని సలహాలు ఇచ్చారని తెలుస్తోంది. అందులో కెప్టెన్ గురించి కూడా ఉందని సమాచారం. అంతర్జాతీయ టీ 20 లకు కెప్టెన్ గా రోహిత్ కు బదులు యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంతను సెలెక్ట్ చేయాలని సలహా ఇచ్చాడని తెలుస్తోంది. అలాగే రోహిత్ ను వైస్ కెప్టెన్ గా తొలగించి కేఎల్ రాహుల్ ను నియమించాలని సూచించాడని సమాచారం. రోహిత్ శర్మకు రిటర్మంట్ వయస్సు దగ్గర పడటంతో యంగ్ ఆటగాళ్ల కు ఆవకాశం ఇవ్వాలని కోహ్లి అన్నట్టు సమాచారం. అయితే ఈ సస్పెన్స్ కు తెర పడాలంటే మరి కొన్ని రోజులు ఓపిక పట్టక తప్పదు.