ఐపీఎల్ ఫేజ్ 2 : పంజాబ్ జట్టులోకి కొత్త ఆటగాడు?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నా రెండవ దశ ఐపీఎల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్  రెండవ దశలో ఏ  జట్టు ఎలా రాణించ బోతుంది అనే దానిపై కూడా ప్రస్తుతం అంచనాలు పెరిగి పోతూనే ఉన్నాయి.  అయితే ప్రస్తుతం రెండవ దశ ఐపీఎల్ కోసం పరిస్థితుల్లో ఎన్ని మార్పులు రావడంతో అన్ని చోట్ల కూడా ఊహించని షాక్ లు తగులుతున్నాయ్. మొదటి దశ ఐపీఎల్ లో ఆయా జట్ల లో ఆడిన ఆటగాళ్లు రెండవ దశలో మాత్రం వివిధ పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్కు దూరం అవుతూ ఉండటం గమనార్హం.

 ఇలా ఇప్పటికే పలు జట్లకు సంబంధించిన ఆటగాళ్లు తాము ఐపీఎల్ ఆడటం లేదు అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.  ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్ జట్టు నుంచి డేవిడ్ మాలన్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు  ఐపీఎల్ రెండవ దశకు తాను అందుబాటులో ఉండడం లేదు అంటూ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డేవిడ్ మలన్ స్థానంలో కొత్త వారిని తీసుకునేందుకు పంజాబ్ కింగ్స్ జట్టు యాజమాన్యం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక కొత్త ఆటగాడిని ఇటీవలే జట్టు యాజమాన్యం రప్పించుకున్నట్లు తెలుస్తోంది.

 డేవిడ్ మలం స్థానం లో పంజాబ్ కింగ్స్ జట్టు ఎవరిని రిప్లేస్మెంట్ చేయ బోతున్నారు అనే విషయాన్ని ఇటీవలే అధికారికం గా ప్రకటించింది. ప్రపంచ నెంబర్ వన్ టి20 బ్యాట్స్మెన్ డేవిడ్ మలన్ స్థానంలో ఏకంగా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ ఎడెన్ మార్కాపుర్ ను తీసుకుంది పంజాబ్ జట్టు.  మరి ఈ ఆటగాడైన ఈసారి పంజాబ్ జట్టుకు టైటిల్ గెలిపించి పెడతారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది  అయితే ఇప్పుడు వరకు పంజాబ్ కింగ్స్ జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: