ఐపీఎల్ ఫేజ్ 2 : పంజాబ్ జట్టులోకి కొత్త ఆటగాడు?
ఇలా ఇప్పటికే పలు జట్లకు సంబంధించిన ఆటగాళ్లు తాము ఐపీఎల్ ఆడటం లేదు అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్ జట్టు నుంచి డేవిడ్ మాలన్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఐపీఎల్ రెండవ దశకు తాను అందుబాటులో ఉండడం లేదు అంటూ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డేవిడ్ మలన్ స్థానంలో కొత్త వారిని తీసుకునేందుకు పంజాబ్ కింగ్స్ జట్టు యాజమాన్యం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక కొత్త ఆటగాడిని ఇటీవలే జట్టు యాజమాన్యం రప్పించుకున్నట్లు తెలుస్తోంది.
డేవిడ్ మలం స్థానం లో పంజాబ్ కింగ్స్ జట్టు ఎవరిని రిప్లేస్మెంట్ చేయ బోతున్నారు అనే విషయాన్ని ఇటీవలే అధికారికం గా ప్రకటించింది. ప్రపంచ నెంబర్ వన్ టి20 బ్యాట్స్మెన్ డేవిడ్ మలన్ స్థానంలో ఏకంగా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ ఎడెన్ మార్కాపుర్ ను తీసుకుంది పంజాబ్ జట్టు. మరి ఈ ఆటగాడైన ఈసారి పంజాబ్ జట్టుకు టైటిల్ గెలిపించి పెడతారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది అయితే ఇప్పుడు వరకు పంజాబ్ కింగ్స్ జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవకపోవడం గమనార్హం.