టోక్యో ఒలంపిక్స్ : క్వార్టర్ ఫైనల్ కు చేరిన భారత్?
ఇప్పటికే ఒలంపిక్స్ మెగా టోర్నీకి కోసం భారత క్రీడాకారుడు అందరూ ఎన్నో రోజుల నుంచి తీవ్రస్థాయిలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒలంపిక్స్ మెగా టోర్నీలో వచ్చిన అవకాశాన్ని అసలు చేర్చుకునేందుకు సిద్ధంగాలేరు భారత క్రీడాకారులు. ఈ క్రమంలోనే అన్ని విభాగాల్లో కూడా భారత క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల ఏకంగా ఆర్చరీ విభాగంలో భారత్ సెమీ ఫైనల్స్ కి దూసుకెళ్లడం భారత ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇటీవలే టోక్యో ఒలంపిక్స్ ఆర్చరీ మిక్స్డ్ ఆర్చరి విభాగంలో భారత క్రీడాకారులు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించారు.
ఇది భారత ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి శుభవార్త అని చెప్పాలి చైనీస్ తైపీపై 5-3 తేడాతో దీపిక కుమారి, ప్రవీణ్ జాదవ్ అద్భుత విజయాన్ని సాధించారు ఇక ఈ విజయంతో క్వార్టర్ ఫైనల్స్ లో అడుగుపెట్టారు ఆర్చరీ మిక్స్డ్ విభాగంలోని భారత క్రీడాకారులు. ఇక ఈ క్వార్టర్ ఫైనల్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల క్వాలిఫైర్ లో భారత్కు నిరాశ ఎదురైంది భారత షూటర్లు ఫైనల్కు చేరుకోలేక నిరాశ పరిచారు అయితే ప్రస్తుతం ఒలంపిక్స్ లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు అందరినీ ప్రోత్సహించేందుకు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది ప్రముఖులు అభిమానులు సైతం పోస్టులు పెడుతూ తమ మద్దతును ప్రకటిస్తున్నారు.