ఇక ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో సెకండ్ మ్యాచ్ లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.అయితే ఇది టీమిండియాకు ‘డూ ఆర్ డై’ మ్యాచ్. నిజానికి ఈ సిరీస్లోని ఫస్ట్ మ్యాచ్లో ఇండియా జట్టు 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సిరీస్ను కాపాడుకోవాలంటే లక్నో వేదికగా జరిగే సెకండ్ టీ20 మ్యాచ్లో భారత జట్టు ఖచ్చితంగా గెలవాల్సిందే.ఇక లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో ఇప్పటి దాకా 5 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగాయి. ఇక్కడ ప్రతిసారీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు గెలుస్తుంది. ఈ విజయాలన్నీ కూడా కొంత ఏకపక్షంగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఈ వికెట్పై ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టుకు మరింత సహాయం అందుతున్నట్లు స్పష్టమైంది. అయితే రాత్రిపూట మ్యాచ్ కావడం వల్ల రెండో ఇన్నింగ్స్లో బౌలర్లను ఇబ్బంది పెట్టవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో టాస్ గెలిచిన తర్వాత కెప్టెన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా అంత అంత సులువు కాదు.
ఈ లక్నోలో జరిగే మ్యాచ్లో ఉష్ణోగ్రత వచ్చేసి 13 నుంచి 15 డిగ్రీల మధ్య ఉంటుంది. మ్యాచ్ జరిగే రోజు వర్షం కురిసే ఛాన్స్ అయితే లేదు. అంటే ఎలాంటి ఆటంకం లేకుండా మ్యాచ్ జరుగుతుంది.ఇక ఇండియా టీం లక్నోలో రెండు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడి రెండింట్లో కూడా విజయం సాధించింది. రెండు సార్లు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ఏకంగా 190+ పరుగులు చేసింది. ఇండియా ఇక్కడ శ్రీలంక ఇంకా వెస్టిండీస్లను ఓడించింది.ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ రాంచీలో జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీం డెవాన్ కాన్వే (52) ఇంకా డారిల్ మిచెల్ (59) అర్ధ సెంచరీలతో 176 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు నిర్ణీత ఓవర్కు కేవలం 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ సిరీస్లో మొదటి ఆట గెలిచి కివీస్ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది.