రంజీ ఫైనల్ కు జడేజా.. వెల్కమ్ చెబుతున్న ఫ్యాన్స్?
జడేజా లాంటి కీలకమైన ఆల్ రౌండర్ లేకపోవడంతో ఇక అతని స్థానాన్ని భర్తీ చేయడానికి టీమిండియా ఎంతో మంది ఆటగాళ్లతో ప్రయత్నాలు చేసింది. కానీ యువ ఆటగాళ్లు ఎవరూ కూడా జడేజాలాగా స్పిన్ బౌలింగ్లో వికెట్లు పడగొట్టడమే కాదు బ్యాటింగ్లో రాణించలేకపోయారు. దీంతో ఇక జడేజా స్థానాన్ని భర్తీ చేయడం కష్టమే అన్న విషయంపై టీం ఇండియా సెలెక్టరు ఒక క్లారిటీ కి వచ్చారు అని చెప్పాలి. అయితే రవీంద్ర జడేజా మోకాలి సర్జరీ గాయం నుంచి కోరుకున్నాడు. అయితే అతను ఫిట్నెస్ నిరూపించుకునేందుకు ముందుగా రంజీ ట్రోఫీలో ఆడాలని ఒక మెలిక పెట్టారు బిసిసిఐ సెలెక్టర్లు.
ఈ క్రమంలోనే అటు రవీంద్ర జడేజా సైతం మళ్లీ మైదానంలోకి దిగి తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు గాయం నుంచి కోలుకున్న జడేజా రంజీ ట్రోఫీ ఫైనల్ లీగ్ కోసం సిద్ధమయ్యాడు అన్నది తెలుస్తుంది. ఇందుకోసం చెన్నై వచ్చాడు. అక్కడి అభిమానులను ఉద్దేశించి వణక్కం చెన్నై అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా.. వెల్కమ్ బ్యాక్ చెన్నై సూపర్ కింగ్.. మా అభిమాన ప్లేయర్ కి చెన్నై నగరం స్వాగతం పలుకుతుంది అంటూ ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా ఆస్ట్రేలియాతో జరగబోయే రెండు టెస్టులకు కూడా అటు జడేజా ఎంపిక అయ్యాడు అన్న విషయం తెలిసిందే.