వన్డే ర్యాంకింగ్స్.. అదరగొట్టిన కోహ్లీ, రోహిత్?

praveen
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో మూడు ఫార్మాట్  లలో కూడా ర్యాంకింగ్స్ లో సత్తా చాటిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇక ఇటీవల కాలంలో మాత్రం ఐసీసీ విడుదల చేసే ర్యాంకింగ్స్ లో పెద్దగా సత్తా చాట లేకపోతున్నారు. మూడు ఫార్మాట్లలో కూడా చెప్పుకోదగ్గర ర్యాంక్ లో కొనసాగడం లేదు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అయితే దాదాపు ఏడాది కంటే ఎక్కువ రోజులపాటు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇకపోతే ఆటగాళ్లు ప్రదర్శన ఆధారంగానే అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు మూడు ఫార్మాట్లకు సంబంధించిన ర్యాంకింగ్స్ ను విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పటికే అటు టీమ్ ఇండియా తరఫున సూర్య కుమార్ యాదవ్ టి20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నాడు.అంతేకాదు ఇటీవల 900 పాయింట్లు సాధించి ఇక ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించారు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల ఐసీసీ వన్డే ఫార్మాట్ కు సంబంధించిన ర్యాంకింగ్స్ లను కూడా ప్రకటించింది అని చెప్పాలి. ఈ ర్యాంకింగ్స్ లో టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ సత్తా చాటారు.

 తమ ర్యాంకింగ్స్ ని మరింత మెరుగుపరచుకున్నారు అని చెప్పాలి. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భాగంగా ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు కూడా అద్భుతంగా రానించారు అని చెప్పాలి. ఒకవైపు రోహిత్ శర్మ 87 పరుగులు చేసి అదరగొట్టగా.. మరోవైపు విరాట్ కోహ్లీ అయితే సెంచరీ చేసి చెలరేగిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ 2 స్థానాలు ఏగబాకి ఆరవ స్థానానికి చేరుకున్నాడు. ఇక రోహిత్ శర్మ ఒక స్థానం మెరుగుపరుచుకుని ఎనిమిదవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఎప్పటిలాగానే ఇక వన్డే ర్యాంకింగ్స్ లో తొలి స్థానంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: