సూర్యని ఊరిస్తున్న అరుదైన.. సాధిస్తే హిస్టరీనే?

praveen
గత కొంతకాలం నుంచి టి20 ఫార్మాట్లో అత్యుత్తమమైన ప్రదర్శన చేస్తున్న సూర్య కుమార్ యాదవ్ రికార్డుల వేట కూడా కొనసాగిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్ జట్టులో ఉన్నాడు అంటే చాలు ఇక అతనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలుస్తాడు అనే విధంగా అతని ప్రదర్శన కొనసాగుతూ ఉంది. ఇక ఇప్పటికే తన అద్భుతమైన ఇన్నింగ్స్ లతో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన సూర్య కుమార్ యాదవ్ ఇక మరిన్ని అరుదైన రికార్డులను బద్దలు కొట్టడమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు.

 శ్రీలంకతో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో కూడా మరోసారి తన బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగించాడు అన్న విషయం తెలిసిందే. శ్రీలంక బౌలర్ లతో చేడుగుడు ఆడేసి. సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే 45 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. మొత్తంగా 51 బంతుల్లో 112 పరుగులు చేశాడు. తద్వారా ఎన్నో రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. రికార్డుల మీద రికార్డులను తిరగరాస్తున్న సూర్య కుమార్ యాదవ్ను ఇక మరో అరుదైన రికార్డు ఊరిస్తుంది అన్నది తెలుస్తుంది.

 ఇప్పటికే ఒకే ఏడాది వ్యవధిలో 3 టీ20 సెంచరీలు చేసి అర్దైన రికార్డు సృష్టించాడు సూర్య కుమార్. ఇక ఇప్పుడు మరో రికార్డుకి అతి చెరువులో ఉన్నాడు. టీ20 ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం 883 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు సూర్య కుమార్.  ఇక ఇలాంటి ప్రదర్శనే కొనసాగిస్తే త్వరలోనే 900 పాయింట్లు అందుకునే ఛాన్స్ ఉంది అని చెప్పాలి. ఇప్పుడు వరకు టి20 క్రికెట్ చరిత్రలో కేవలం కొంతమంది మాత్రమే 900 పాయింట్ల మార్క్ ను అందుకున్నారు. కోహ్లీకి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. కేవలం డేవిడ్ మల్లాన్, ఆరోన్ ఫించ్ మాత్రమే 900 పాయింట్లు అందుకోగా ఇక సూర్య ఈ రికార్డ్ సాధిస్తే.. అరుదైన ఘనత సాధించిన తొలి భారతీయుడుగా మారిపోతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: