టీమిండియా జెర్సీలో.. ఈ మార్పు గమనించారా?

praveen
కొత్త సంవత్సరాన్ని టీమ్ ఇండియా సరికొత్తగా టి20 సిరీస్ తో ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత పర్యటనకు వచ్చిన శ్రీలంకతో ప్రస్తుతం టి20 సిరీస్ ఆడుతుంది. ఇటీవలే మొదటి టి20 మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్నట్లుగానే ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోరులో ఇక రెండు పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించి కొత్త ఏడాదిలో శుభారంభం చేసింది అని చెప్పాలి. హార్దిక్ పాండ్య మరోసారి తన కెప్టెన్సీ తో భారత జట్టుకు విజయాన్ని అందించి అదరగొట్టాడు. అదే సమయంలో ఇక టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకున్న ఎంతో మంది యువ ఆటగాళ్లు సైతం అదిరిపోయే ప్రదర్శన చేసారు అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవలే టీమ్ ఇండియాలో యువ ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారో అన్న విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా టీమ్ ఇండియా తరఫున తన డెబ్యు మ్యాచ్ ఆడిన శివమ్ మావి ఏకంగా నాలుగు ఓవర్లలో 20 పైగా పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి అదిరిపోయే ప్రదర్శన చేశాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల టీమిండియా విజయం గురించి మాత్రమే కాదు టీమ్ ఇండియా జెర్సీ గురించి కూడా అందరూ చర్చించుకుంటున్నారు. ఇటీవల టీమిండియా ప్లేయర్ చాహల్ ఇంస్టాగ్రామ్ వేదికగా తన సహచర ఆటగాళ్లతో దిగిన ఫోటోని పోస్ట్ చేశాడు.

 ఈ క్రమంలోనే ఈ ఫోటోలో కాస్త క్షుణ్ణంగా పరిశీలిస్తే భారత జెర్సీలో చిన్న మార్పు ఉంది అన్న విషయం తెలుస్తుంది  భారత జెర్సీపై ఉన్న స్పాన్సర్ పేరు పూర్తిగా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా భారత ఆటగాళ్ల జెర్సీపై ఎంపీఎల్ కు బదులుగా కిల్లర్ అనే లోగో ఉంది. దీన్నిబట్టి ఆటగాళ్ళ కిట్ స్పాన్సర్షిప్ మారిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు అటు బీసీసీఐ మాత్రం అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని బయట పెట్టలేదు అని చెప్పాలి. కాగా టీమ్ ఇండియా జెర్సీకి ప్రధాన స్పాన్సర్లలో బైజుస్ ఎం పి ఎల్ కీలకంగా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: