డబుల్ సెంచరీ చేసిన కోహ్లీ.. కన్ఫ్యూజ్ అవుతున్న ఫ్యాన్స్?

praveen
కోహ్లీ.. ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరు కూడా టీమిండియా మాజీ కెప్టెన్.. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల రన్ మిషన్ విరాట్ కోహ్లీ గుర్తుకు వస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఎందుకంటే తన ఆట తిరుతో ప్రపంచ క్రికెట్లో అతను అలాంటి హవా నడిపించాడు. ఈ క్రమంలోనే కోహ్లీకి సంబంధించిన వార్త ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చిందంటే చాలు అది కాస్త వైరల్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు కోహ్లీ కి సంబంధించిన వార్త వైరల్ గా మారిపోయింది. కోహ్లీ డబుల్ సెంచరీ చేశాడు అంటూ వార్త సారాంశం. దీంతో ఇది చూసిన ఎంతో మంది అభిమానులు మాకు తెలియకుండా కోహ్లీ ఎప్పుడు డబల్ సెంచరీ చేసాడబ్బా అని తెలుసుకోవడం మొదలుపెట్టారు.

 అయితే ఇలా డబుల్ సెంచరీ చేసింది మన అందరికీ తెలిసిన దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ కాదు ఇప్పుడిప్పుడే క్రికెట్లో ఒక్కో మెట్టు ఎదుగుతున్న మిజోరాం కెప్టెన్ తరువార్ కోహ్లీ.  ఇటీవల రంజీ ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్లో మిజోరాం కెప్టెన్ తరువార్ కోహ్లీ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. మొదట బంతితో రెండు వికెట్లు తీసి మాయ చేసిన కోహ్లీ.. బ్యాటింగ్ లో కూడా డబుల్ సెంచరీ చేసాడు. 297 బంతుల్లో 203 పరుగులు చేశాడు.  ఇందులో 34లు ఫోర్లు, ఒక సిక్స్ ఉండడం గమనార్హం. అంతేకాదు తరువార్ కోహ్లీకి సంబంధించిన మరో విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. రంజి క్రికెట్లో ఆడుతున్న యువ ఆటగాడు కోహ్లీ మన అందరికీ తెలిసిన స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి మంచి మిత్రుడట.

 ఇక స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మిజోరాం కెప్టెన్ తరువార్ కోహ్లీ 2008లో భారత్ అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యులు అన్న విషయం చాలామందికి తెలియదు. నాటి ప్రపంచ కప్ లో విరాట్తో సమానంగా పరుగులు చేసిన తరువార్ ఎంతగానో ఆకట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత నిలకడలేమి కారణంగా జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోలేకపోయాడు అని చెప్పాలి.  ఇలా తన సహచర ఆటగాడి కంటే మెరుగైన ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూ క్రికెట్ చరిత్రలో మేటి ఆటగాడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: