వాటర్ బాటిల్ లో ధోని.. కోహ్లీ పోస్ట్ వైరల్?

praveen
భారత క్రికెట్లో మాజీ మహేంద్రసింగ్ ధోని కి ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు భారత క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ కి సాధ్యం కాని రీతిలో ఏకంగా రెండు వరల్డ్ కప్ లు సాధించిన ఏకైక కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నారు మహేంద్రసింగ్ ధోని   అయితే సారధిగా ఇప్పటికే చరిత్ర పుటల్లోకి వచ్చిన మహేంద్రసింగ్ ధోని ఒక ఆటగాడిగా కూడా ప్రపంచ క్రికెట్లో తాను అత్యుత్తమం అని నిరూపించుకున్నాడు. వికెట్ల వెనకాల ఉండి తన వ్యూహాలతో మ్యాచ్ స్వరూపాన్ని మొత్తం తన వైపుకు తిప్పగల సమర్థుడు మహేంద్రసింగ్ ధోని.

 ఇక ధోని ప్రపంచ క్రికెట్లో సారధిగా ఉన్న సమయంలోనే నేటి రోజుల్లో స్టార్లుగా కొనసాగుతున్న ఎంతోమంది ఆటగాళ్లు క్రికెట్లో రాటుదేలారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇలా ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో   భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆటగాళ్ళలో ప్రస్తుతం స్టార్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ కూడా ఒకరు అని చెప్పాలి  ధోని ఇచ్చిన మద్దతు కారణంగానే తాను కెరియర్లో ఎదగా గలిగాను అని ఎన్నోసార్లు ధోనిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.

 ఇక ధోని తర్వాత భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పుకున్నప్పటికీ తాను ఎప్పటికీ ధోనీని కెప్టెన్ గానే చూస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అంతెకాదు తన కష్ట కాలంలో కూడా ధోని సపోర్టుగా నిలిచాడని ఎన్నోసార్లు కృతజ్ఞత చాటుకున్నాడు. అయితే ఇటీవల ధోని గురించి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు కోహ్లీ అని చెప్పాలి. వాటర్ బాటిల్ పట్టుకొని ఆ బాటిల్ అడుగున ఉన్న ఐస్ ని.. బాటిల్ పై ఉన్న ధోని ఫోటో చూపిస్తూ ధోని ప్రతి చోట ఉంటాడు అంటూ కామెంట్ చేశాడు  ఆఖరికి వాటర్ బాటిల్లో కూడా అంటూ కామెంట్ చేయగా ఈ పోస్ట్ వైరల్ గా మారిపోయింది . కాగా ధోనినీ అభిమానులు మిస్టర్ కూల్ అని పిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: