టెన్నిస్ లోను ధోని తోపే.. ఫైనల్ చేరుకున్నాడుగా?
ఇక ధోని క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా అతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ధోని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోయినప్పటికీ అతనికి సంబంధించిన వార్తలు మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ అద్భుతంగా ఆడగలడు అన్న విషయం అందరికీ తెలుసు. ఒత్తిడి సమయంలో కూడా అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చి జట్టుకు విజయాన్ని అందించగలడు అని అందరూ నమ్మకాన్ని పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇలా అభిమానులను నమ్మకాన్ని నిజం చేసి చూపించాడు మహేంద్రసింగ్ ధోని. ఇదిలా ఉంటే ధోని క్రికెట్ మాత్రమే బాగా ఆడతాడు అని అందరికీ తెలుసు కానీ ఇప్పుడు టెన్నిస్ లో కూడా అదరగొడుతున్నారు.
రాంచీలోని జె ఎస్ సి ఏ నిర్వహిస్తున్న టెన్నిస్ టోర్నమెంట్లో అద్భుతంగా ఆడుతూ ఏకంగా ఫైనల్ వరకు వెళ్ళాడు.. గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ టోర్నీ డబుల్స్ కేటగిరీలో ధోని- సుమిత్ బజాజ్ జోడి ఏకంగా ఫైనల్ కు చేరుకోవడం గమనార్హం. ఫైనల్లో వీరు వినీత్- కైఫ్ జోడితో తలబడబోతున్నారు. ఇక ధోని ఎక్కడైనా ఉన్నాడు అని తెలిస్తే అక్కడికి తరలి వెళ్తూ ఉంటారు అభిమానులు. ఇక ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నాడు అన్న విషయం తెలిసి ఇక అక్కడికి వెళ్లి ధోని ఆటను చూసేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు అభిమానులు అని చెప్పాలి.