టెన్నిస్ లోను ధోని తోపే.. ఫైనల్ చేరుకున్నాడుగా?

praveen
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్ గా ఒక ఆటగాడిగా తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. వరల్డ్ లోనే బెస్ట్ ఫినిషర్ గా పేరు సంపాదించుకున్న ధోని అటు బెస్ట్ వికెట్ కీపర్ గాను చరిత్రలోకెక్కాడు. ఇక భారత క్రికెట్లో అయితే ఇప్పటివరకు ఏ కెప్టెన్కు సాధ్యం కాని రీతిలో మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ గా కూడా కొనసాగుతున్నాడు మహేంద్ర సింగ్ ధోని. అయితే ఇక ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తున్న ఎంతో మంది యువ ఆటగాళ్లకు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

 ఇక ధోని క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా అతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ధోని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోయినప్పటికీ అతనికి సంబంధించిన వార్తలు మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ అద్భుతంగా ఆడగలడు అన్న విషయం అందరికీ తెలుసు. ఒత్తిడి సమయంలో కూడా అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చి జట్టుకు విజయాన్ని అందించగలడు అని అందరూ నమ్మకాన్ని పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇలా అభిమానులను నమ్మకాన్ని నిజం చేసి చూపించాడు మహేంద్రసింగ్ ధోని. ఇదిలా ఉంటే ధోని క్రికెట్ మాత్రమే బాగా ఆడతాడు అని అందరికీ తెలుసు కానీ ఇప్పుడు టెన్నిస్ లో కూడా అదరగొడుతున్నారు.

 రాంచీలోని జె ఎస్ సి ఏ నిర్వహిస్తున్న టెన్నిస్ టోర్నమెంట్లో అద్భుతంగా ఆడుతూ ఏకంగా ఫైనల్ వరకు వెళ్ళాడు.. గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ టోర్నీ డబుల్స్ కేటగిరీలో ధోని- సుమిత్ బజాజ్ జోడి ఏకంగా ఫైనల్ కు చేరుకోవడం గమనార్హం. ఫైనల్లో వీరు వినీత్- కైఫ్ జోడితో తలబడబోతున్నారు. ఇక ధోని ఎక్కడైనా ఉన్నాడు అని తెలిస్తే అక్కడికి తరలి వెళ్తూ ఉంటారు అభిమానులు. ఇక ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నాడు అన్న విషయం తెలిసి ఇక అక్కడికి వెళ్లి ధోని ఆటను చూసేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు అభిమానులు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: