మరోసారి వార్తల్లో అశ్విన్.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా?

praveen
సాదరణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మాత్రమే కాదు ఇక మ్యాచ్ ప్రారంభం కావడానికి కూడా ఎన్నో ఆసక్తికర ఘటనలు కెమెరాకు చిక్కుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంటాయి అని చెప్పాలి.  ఆటగాళ్లు చేసే పనులు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇక ఇటీవల టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన పని కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. రవిచంద్రన్ అశ్విన్ చేసిన పనికి అందరూ కూడా పగలబడి నవ్వుకుంటున్నారు అని చెప్పాలి.

 ఏకంగా మైదానంలో పడి ఉన్న జెర్సీలలో తన జెర్సీ ఏదో తెలుసుకోవడానికి ఏకంగా వాసన చూసి మరి పసిగట్టాడు రవిచంద్రన్ అశ్విన్.  ఒకవైపు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ వేస్తున్న సమయంలో సీరియస్ గా మాట్లాడుతుండగా అతని వెనుక అశ్విన్ ఇక ఇలాంటి పనిచేయడం గమనార్హం. ఇక ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ వీడియోని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చాలా మంది చేసే పని ఇదే. శీతాకాలంలో దుస్తులు వచ్చినప్పుడు ఇదే టెక్నిక్ ను నేను వాడతాను.  భారత్ లో ఇది మామూలు విషయం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

 అయితే ఇక ఈ వీడియో వైరల్ కావడంపై రవిచంద్రన్ అశ్విన్ కూడా స్పందించాడు. సైజును బట్టి వేరు చేయడానికి కాదు అదే మొదటిసారి వేసుకుందా అని పరిశీలించడానికి కూడా కాదు.. ఎందుకంటే నేను వాడే పెర్ఫ్యూమ్ అదేనా అని చెక్ చేస్తున్న.. అరే కెమెరా మాన్ అంటూ పగలబడి నవ్వుతున్న ఎమోజి లను రవిచంద్రన్ అశ్విన్ కూడా జత చేశాడు అని చెప్పాలి. ఇక జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ కు ముందు ఈ ఫన్నీ సంఘటన జరిగింది.  అయితే ఈ మ్యాచ్లో రవిచంద్రన్ ఏకంగా కీలకమైన మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: