ఇండియా ఓటమితో పాకిస్తాన్ ఇంటికి.. ట్రోల్స్ చూస్తే నవ్వాపుకోలేరు?

praveen
టి20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ పని ముగిసిపోయినట్టేనా అంటే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ మాత్రం అవును అని. ఏదో అద్భుతం జరిగితే తప్ప అటు పాకిస్తాన్ జట్టు సెమి ఫైనల్లో అడుగుపెట్టలేదు అన్న విషయం తెలుస్తుంది. ఇటీవల భారత జట్టు ఓడిపోవడం కారణంగా అటు పాకిస్తాన్ సెమీఫైనల్ ఆశలకు గండి కొట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికా టీమ్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా ఓటమి చవిచూసింది .


 ఈ ఓటమి అటు పాకిస్తాన్ కూ నిరాశ మిగిల్చిది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ జరిగిన నాటి నుంచి పాకిస్తాన్ సెమీఫైనల్ అవకాశాలు గల్లంతయ్యాయి అనే విషయంపై ఎంతోమంది స్పందిస్తూ ఉన్నారు. ఏకంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సైతం స్పందిస్తూ టీమ్ ఇండియా గెలిచి ఉంటే బాగుండేది అంటూ నిరాశ వ్యక్తం చేయడం కూడా చూసాము అని చెప్పాలి. మరి కొంతమంది పాకిస్తాన్ నూ ఇంటికి పంపించడానికి టీం ఇండియా ఓడిపోయింది అంటూ ఇక ట్రోల్స్ చేయడం కూడా మొదలుపెట్టారు.  అయితే టీమిండియా ఓడిపోవడంతో పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది అన్న విషయాన్ని తెలియజేస్తూ నెటిజెన్లు ట్రోల్స్ తో రెచ్చిపోతున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూ నెటిజెన్లు అందరిని కూడా కడుపుబ్బా నవ్విస్తున్నాయి అని చెప్పాలి. ఈ ట్రోల్స్ లో భాగంగా ఒక వీడియోలో టీవీ పై ఒక పాకిస్తాన్ అభిమాని టవల్ వేసి ఇక టీమిండియా ఎలా ఆడుతుందా అని ఆశగా అప్పుడప్పుడు టవల్ పైకెత్తి చూడటం చూడవచ్చు. ఇక మరో వీడియోలో దక్షిణాఫ్రికా భారత్ మధ్య మ్యాచ్ జరిగితే అటు పాకిస్తాన్ కు ఎలా డామేజ్ అయింది అన్న విషయాన్ని కూడా చూపించారు. ఇంకో వైపు టీమిండియా ఆటగాళ్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి సంబరాల్లో మునిగిపోయినట్లుగా ఉన్న వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: