హ్యాట్రిక్ సాధించిన టీమిండియా.. తిరుగులేని విజయం?
ఇలాంటి సమయంలోనే అంచనాలకు మించి రాణిస్తున్న భారత మహిళల జట్టు ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతమైన ప్రదర్శనతో విజయ డంకా మోగిస్తుంది. ప్రత్యర్థులకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆదిపత్యాన్ని కనబరుస్తూ ప్రత్యర్థి జట్లను చిత్తుగా ఓడిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆసియా కప్ లో భాగంగా రెండు విజయాలు సాధించి అదరగొట్టిన భారత మహిళల జట్టు ఇక ఇటీవల హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది అని చెప్పాలి. మహిళల ఆసియా కప్ లో భాగంగా యూఏఈ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 14 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది భారత మహిళల జట్టు.
ఇక ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసింది టీమిండియా. ఈ క్రమంలోనే నిర్ణయిత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది అని చెప్పాలి. నామమాత్రమైన లక్ష్యంతో బలిలోకి దిగిన యూఏఈ జట్టు భారత బౌలింగ్ దాటికి ఎక్కువ పరుగులు చేయలేకపోయింది. వరుసగా బ్యాట్స్మెన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం మొదలుపెట్టారు. దీంతో నాలుగు వికెట్ల నష్టానికి 74 పరుగులు మాత్రమే చేసింది. తద్వారా ఏకంగా 104 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది టీం ఇండియా జట్టు. హ్యాట్రిక్ విజయాలతో సెమిస్ లో అడుగుపెట్టే అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది అని చెప్పాలి.