టి20 వరల్డ్ కప్.. టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ జట్టు ఇదే?

praveen
మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. టి20 వరల్డ్ కప్ లో భాగంగా అద్భుతంగా రాణించడానికి అన్ని జట్లు కూడా సిద్ధమై అయిపోయాయి. ఐసీసీ విధించిన నిబంధనల ప్రకారం అన్ని దేశాల జట్లు కూడా తమ దేశం తరఫున టి20 వరల్డ్ కప్ లో ఆడబోయే జట్టు వివరాలను ప్రకటిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. బీసీసీఐ కూడా 15 మంది సభ్యులతో కూడిన వివరాలను ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
 కొంత మంది ఆటగాళ్లకు టీమిండియా లో చోటు ఇవ్వడం పై ప్రశంసలు కురిపిస్తూ ఉంటే... కొంత మంది ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కకపోవడం పై విమర్శలు కూడా ఎదుర్కొంటుంది బీసీసీఐ. ఇలాంటి సమయంలో ఇటీవలి కాలంలో బిసిసిఐ ప్రకటించిన 15 మంది సభ్యులలో ప్లేయింగ్ ఎలెవెన్ ఎవరైతే బాగుంటుంది అనే విషయంపై ఎంతోమంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా  వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.

 ఈ క్రమం లోనే తమ అంచనా ప్రకారం ప్లేయింగ్ ఎలెవన్ జట్టు ఎవరు ఉంటారు అన్న విషయం పై తమ అభిప్రాయాలను ఇక సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉండడం గమనార్హం. ఇటీవల ఇదే విషయం పై టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టును సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్,,భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, బుమ్రా  చాహల్ కు చోటు కల్పించారు. మరి కొంత మంది ఆటగాళ్లు కూడా ఇదే విషయంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: