టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆ ఇద్దరు వచ్చేస్తున్నారు?

praveen
ఇటీవలే ఆసియా కప్ లో భాగంగా భారత బౌలింగ్ విభాగం ఎంత బలహీనంగా కనిపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతకు ముందు వరకు భారత బౌలింగ్ విభాగంలో జస్ప్రిత్ బుమ్రా తో పాటు హర్షల్ పటేల్ కూడా ఉన్నారు. వీరిద్దరు డెత్ ఓవర్లలో బౌలింగ్ చూస్తూ పరుగులు కట్టడి చేయడంలో ఎవరికి వారే సాటి అని చెప్పాలి. అంతే కాదు వికెట్లు కూడా పడగొడుతూ ప్రత్యర్థి జట్టును ఈ ఇద్దరు ఆటగాళ్లు కష్టాల్లోకి నెడుతూ ఉండేవారు. కానీ ఆసియా కప్ ప్రారంభానికి ముందు ఇద్దరు ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యాడు.

 గాయం బారిన పడిన నేపథ్యంలో చివరికి టీమిండియా సెలెక్టర్లు వీరిని జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పాలి.. ఈ క్రమంలోనే ఆసియా కప్లో భాగంగా భారత బౌలింగ్ విభాగం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక అప్పుడప్పుడు భువనేశ్వర్ కుమార్ బాగా రాణించాడు తప్ప మిగతా బౌలర్లు ఎవరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు అని చెప్పాలి. అంతేకాదు ఫైనల్ చేరకుండా ఇక సూపర్ 4 లో వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయినా చివరికి కప్పు గెలవకుండానే ఇంటి బాట పట్టింది టీమిండియా జట్టు.

 అయితే మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్కప్ ప్రారంభం అయ్యే లోపు జస్ప్రిత్ బూమ్రా హర్షల్ పటేల్ లాంటి కీలక బౌలర్లు జట్టులోకి చేరుతారా లేదా అన్న అనుమానం నెలకొంది. ఇలాంటి సమయంలో ఇక టీమిండియాకు ప్రపంచకప్ ముందు గుడ్ న్యూస్ అందింది అనేది తెలుస్తుంది. యార్కర్ల కింగ్ బుమ్రాతో పాటు డెత్ ఓవర్ లలో బాగా రాణించే హర్షల్ పటేల్ కూడా ఫుల్ ఫిట్నెస్ సాధించాడు. ఇక వీరు బెంగళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ నిర్వహించిన ఫిట్నెస్  టెస్టుల్లో కూడా పాస్ అయ్యారని తెలుస్తోంది. ఇక మరి కొన్ని రోజుల్లో వీళ్లు జట్టుతో చేరబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: