ఆసియా కప్.. టీమ్ ఇండియా ఫైనల్ వెళ్లేందుకు మరో ఛాన్స్?
దీంతో టీమిండియా అభిమానులందరూ కూడా నిరాశ లో మునిగిపోయారు అని చెప్పాలి. ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమ్ ఇండియా ఆసియా కప్ గెలుస్తుందని అనుకుంటే ఇక ఇప్పుడు ఫైనల్ లో కూడా అడుగు పెట్టలేక పోతుంది అని అనుకుంటున్నారు. అయితే శ్రీలంకపై ఓటమితో టీమిండియా ఫైనల్ కు వెళ్లే అవకాశాలు దాదాపు కనుమరుగు అయినట్లే.. దీంతో టీమిండియా ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పటికి కూడా భారత్ ఫైనల్ కు వెళ్లేందుకు మరో ఛాన్స్ ఉంది అన్నది మాత్రం తెలుస్తుంది.
అయితే అది టీమిండియా ప్రదర్శన మీద ఆధారపడి లేదు. మిగతా జట్ల మధ్య జరగబోయే మిగితా మ్యాచ్ల ఫలితాల మీద ఆధారపడి ఉంది అని తెలుస్తుంది. పాకిస్థాన్ జట్టు నేడు ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతుంది.. ఇక శుక్రవారం శ్రీలంకతో కూడా మ్యాచ్ ఆడుతుంది. అయితే పాకిస్థాన్ జట్టు ఆఫ్ఘనిస్తాన్,శ్రీలంక చేతిలో ఓడిపోవాలి.. అలాగే టీమ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ పై భారీ తేడాతో విజయం సాధించాలీ. అప్పుడు భారత్ పాకిస్థాన్ ఆప్ఘనిస్థాన్ రెండేసి పాయింట్లతో సమానంగా ఉంటాయి. అయితే ఇంత జరిగిన తర్వాత కూడా పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్ కంటే టీమిండియాకు రన్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా జరగడం అసాధ్యం. కానీ ఇండియాకు ఉన్న ఒకే ఒక్క ఛాన్స్ మాత్రం ఇదొక్కటే.