ఆ రోజే నా కెరీర్ ముగిసిపోయిందనుకున్నా : కోహ్లీ
దీంతో విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చాడు అంటూ అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోతున్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి సమయంలో కోహ్లీ ఇటీవలే తనపై విమర్శలు చేసిన వారిపై గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. టీవీ ఛానళ్లలో సలహాలు ఇవ్వడం కాదని వ్యక్తిగతంగా మాట్లాడి సలహాలు ఇస్తే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. ధోని ఒక్కడే తనకు పర్సనల్గా మెసేజ్ చేసి సలహాలు ఇచ్చాడు అంటూ తెలిపాడు విరాట్ కోహ్లీ. ఇక ఇదే సమయంలో యంగ్ బౌలర్ అర్ష దీప్ సింగ్ చేసిన క్యాచ్ మిస్ పై కూడా ఇటీవల స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అతను క్యాచ్ మిస్ చేయడం వల్ల టీమిండియా ఓడిపోయింది అంటూ ఎంతో మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ సమయంలోనే ఈ విషయంపై స్పందించిన విరాట్ కోహ్లీ ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు తప్పు చేస్తారని ఇలాంటివి క్రికెట్లో సర్వసాధారణం అంటూ తెలిపాడు. ఇందుకు తాను కూడా అతీతుడిని కాదు అంటూ తెలిపాడు. 2009 చాంపియన్స్ ట్రోఫీ తన మొదటి మ్యాచ్ లోనే పాకిస్థాన్ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది బౌలింగ్లో చెత్త షాట్ ఆడి వికెట్ కోల్పోయాను. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. ఇక ఆరోజే నా కెరీర్ ముగిసిపోయింది అని అనుకున్నాను అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.