ఇండియా 36 పరుగులకు ఆలౌట్.. పగటి కలలొద్దంటున్న ఫ్యాన్స్?
ఇప్పటికే ఆసియా కప్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులకు పైసా వసూల్ మ్యాచ్ మారిపోయింది. కాగా నేడు మరో సారి దాయాదుల పోరు జరగబోతోంది. ఇలాంటి సమయంలోనే ఇక పాకిస్తాన్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులతో రెచ్చి పోతూ ఉండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవల హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు మంచి ప్రదర్శన చేసింది. కేవలం 38 పరుగులకే ఆలౌట్ చేసి ఘన విజయాన్ని అందుకుంది.
ఇక ఇలాంటి అద్భుతమైన ప్రదర్శన తర్వాత ఇప్పుడు టీమిండియాతో మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు ఎలా రాణిస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. దీంతో నేడు జరగబోయే మ్యాచ్ పై మరింత ఉత్కంఠ పెరిగిపోయింది. అయితే ఇప్పటికే భారత్ జట్టులో ఓడిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతుండటం గమనార్హం. హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ బౌలర్లు చెలరేగడంతో ఈ జట్టు 38 పరుగులకు ఆలౌటైంది. కాగా ఇదే ప్రదర్శనను పాకిస్థాన్ భారత్పై కూడా చేసి చూపిస్తారని ఊహించుకోండి.. ఫలితం కనిపిస్తుంది.. టీమిండియా కేవలం 36పరుగులకే ఆలౌట్ అయ్యి దారుణ పరాజయం మూటగట్టుకుంది అంటూ ఒక ట్వీట్ చేశాడు. దీంతో అతన్ని భారత ఫాన్స్ అందరు కూడా పగటి కల లో నుంచి బయటికి రా అంటూ కామెంట్ చేస్తున్నారు.