ఇషాన్ కిషన్ పై.. అక్షర్ పటేల్ సీరియస్.. వీడియో వైరల్?

praveen
ఇటీవలే జింబాబ్వే లోని హరారే వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో మరోసారి టీమిండియా అదరగొట్టింది అన్న విషయం తెలిసిందే. ఎంతో అలవోకగా ప్రత్యర్థి జింబాబ్వేపై విజయం సాధించి రెండో వన్డే మ్యాచ్లో కూడా తమకు తిరుగు లేదు అని నిరూపించింది. ఈ క్రమంలోనే మూడు వన్డేల సిరీస్లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించిన టీమిండియా జట్టు ఒక మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్ కైవసం చేసుకుంది అనే చెప్పాలి. కాగా మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 38.1 ఓవర్లలో కేవలం 161 పరుగులు మాత్రమే చేసింది.

 ఇక ఆ తరువాత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో 25.5 ఓవర్లలోనే జింబాబ్వే తమ ముందు ఉంచిన టార్గెట్ ను చేదించింది అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఇక జింబాబ్వేపై భారత్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జింబాబ్వే ఇన్నింగ్స్  28 ఓవర్ సమయంలో ఈ ఘటన జరిగింది. 28 ఓవర్ వేశాడు దీపక్ హుడా. ఈ క్రమంలోనే జింబాంబ్వే బ్యాట్స్మెన్ బర్ల్ డీప్ స్క్వేర్ దిశగా బంతిని ఆడాడు.  అయితే డీప్ స్క్వేర్ లెగ్ లో ఫీలింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలోనే బంతిని అందుకున్న ఇషాన్ కిషన్ మిడ్ వికెట్ దిశగా త్రో చేశాడు.

 అయితే ఇషాన్ కిషన్ విసిరిన బంతి నేరుగా మిడ్ వికెట్ లో ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ ను తగ్గుతుందేమో అనే విధంగానే దూసుకెళ్లింది. ఇది గమనించిన అక్షర్ పటేల్ తనకు ఎక్కడ బంతి తగులుతుందో అన్న భయం తో తలపై చేతులు పెట్టుకుని భయం భయం తో కింద కూర్చుండిపోయాడు. అయినప్పటికీ కూడా ఇషాన్ కిషన్ విసిరిన బంతి అక్షర్ పటేల్ కు తగిలింది. దీంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు అక్షర్ పటేల్. వెంటనే ఈ విషయాన్ని కిషన్ వైపు తిరిగి సీరియస్ గా చూశాడు. అయితే ఇషాన్ కిషన్ కూడా అక్షర్ పటేల్ కు క్షమాపణ చెప్పడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: