సంజూ శాంసన్.. నిజంగా నక్క తోక తొక్కాడబ్బా?
జట్టులో ఉన్న కె.ఎల్.రాహుల్ కరోనా వైరస్ బారినపడి అనూహ్యంగా టీమిండియాకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక కె.ఎల్.రాహుల్ చోటు టీమిండియా లో ఖాళీ అయింది. ఇక కేఎల్ రాహుల్ స్థానంలో ఎవరిని భర్తీ చేయాలని సెలెక్టర్లు ఆలోచించిన సమయంలో అంతకుముందు జరిగిన వన్డే సిరీస్లో బాగా రాణించిన సంజూ శాంసన్ ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఈ క్రమంలోనే ఇక టీ20 సిరీస్ లో కూడా సంజూ శాంసన్ అందుబాటులోకి వచ్చాడు అనే విషయం తెలిసిందే.
ఇలా గత కొంత కాలం నుంచి టీమిండియాకు దూరమయిన సంజూ ఇప్పుడిప్పుడే మంచి ప్రదర్శనతో టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు సంజూ శాంసన్ . ఇక జట్టులో చోటు దక్కడం మాత్రం అదృష్టమనే చెప్పాలి. దీంతో ఎంతోమంది అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదటి టి20 మ్యాచ్ లో భాగంగా 58 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. అయితే మొదట టి20 మ్యాచ్ లో మాత్రం సంజూ శాంసన్ తుది జట్టులో చోటు దక్కించుకోలేదు. ఇక తర్వాత మ్యాచ్ లో అయినా తుది జట్టులోకి వస్తాడో లేదో చూడాలి.