మొన్న బద్ధ శత్రువులు.. ఇప్పుడు కలిసిపోయారు?

praveen
టీం ఇండియా మాజీ ఆటగాడు విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత అగ్రసీవ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇక మైదానంలో ప్రత్యర్థులపై మాటల యుద్ధానికి దిగడం లో కూడా విరాట్ కోహ్లీ ఎప్పుడూ ముందు ఉంటాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన  టెస్ట్ మ్యాచ్  సమయంలో కూడా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇదే దూకుడు ప్రదర్శించాడు. ఇంగ్లాండ్ ప్లేయర్ జానీ బెయిర్ స్టో తో మైదానంలో తలపడ్డాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం సంచలనంగా మారిపోయింది. ఇక ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

 ఇలా మైదానంలో మాటల యుద్ధం తర్వాత స్పందించిన బెయిర్ స్టో మైదానంలో ఇలాంటివి సహజమేనని.. ఎవరు ఎంత మాటల యుద్ధానికి దిగిన కేవలం జట్టును గెలిపించడం కోసమేనని ఇక మైదానంలో ఎంతలా స్లెడ్జింగ్ చేసుకున్న బయట మాత్రం స్నేహితుల్లా ఉంటామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ స్పందించాడు. ఇకపోతే మొన్నటికి మొన్న మైదానంలో బద్ధశత్రువుగా కనిపించిన కోహ్లీ, బెయిర్ స్టో ఇటీవల లార్డ్స్ వేదికగా జరిగిన వన్డే కు ముందు మళ్లీ స్నేహితులుగా కలిసిపోయినట్లు గానే కనిపించారు.

 జానీ బెయిర్ స్టో మైదానం నుంచి బయటకు వెళ్తూ ఉండగా విరాట్ కోహ్లీ అప్పుడే మైదానంలోకి వస్తున్నాడు. ఈ సమయంలోనే ఇద్దరు కలిసి చేయి చేయి కలుపుతారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే చోట నిలబడి చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇక వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో  ఫీల్డులో ఉన్న అభిమానులకు కూడా దృశ్యం బాగా నచ్చింది అని చెప్పాలి.  దీంతో ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ గా మారిపోయింది. ఇక ఇది చూసిన తర్వాత మైదానంలో ఆటగాళ్లు ఎంత దూకుడుగా  ఉన్నప్పటికీ ఎంత మాటల యుద్ధం జరిగినప్పటికీ బయట మాత్రం కలిసిపోతారు అర్థం అవుతుంది అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: