ఇంగ్లాండ్ "బీస్ట్" లు మూగబోయిన వేళ.. రోహిత్ సేన విద్వంసం !
ముఖ్యంగా రోహిత్ శర్మ తన కమ్ బ్యాక్ ను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లను ఉతికారేశాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ మాత్రం ఫెయిల్ అయ్యాడు. దీపక్ హూడా ఎప్పటిలాగే తన స్టైల్ లో ఆడి విలువైన పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ కూడా మళ్ళీ మునుపటి ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఐర్లాండ్ లో కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్య అయితే నెమ్మదిగా ఆడుతూ కెరీర్ లో మొదటి అర్ద సెంచరీని సాధించాడు. అలా నిర్ణీత 20 ఓవర్ లలో ఇండియా 198 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ మొదటి నుండి తడబడింది. మ్యాచ్ కు ముందు చెలరేగి ఆడుతారు అనుకున్న వారందరూ ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ లో బీస్ట్ ప్లేయర్స్ అయినా బట్లర్, రాయ్, లివింగ్స్టన్ లు తోకముడిచారు. ఇండియా అద్భుతమైన బౌలింగ్ తో కేవలం 148 పరుగులకే ఆల్ అవుట్ చేసి ఈ సిరీస్ లో లీడ్ లోకి వెళ్ళింది. అన్ని విభాగాలలో ఆధిపత్యం ప్రదర్శించిన రోహిత్ సేన ఘన విజయాన్ని అందుకుంది.