గెలుపుపై సంజు శాంసన్ ట్విట్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్?

praveen
రాజస్థాన్ రాయల్స్,  ఢిల్లీ క్యాపిటల్స్  జట్ల మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్లో ఒక చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. ఆఖరి వరకూ ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో మూడో బంతికి అంపైర్  నో బాల్ గా ప్రకటించలేదు అన్న కారణంతో రిషబ్ పంత్ ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంపైర్ నిర్ణయం పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన రిషబ్ పంత్ మైదానంలో ఉన్న ఆటగాళ్లను రిటైర్డ్ అవుట్  గా బయటకు వచ్చేయాలి అంటూ సైగలు చేయడం తో అందరూ షాక్ లో మునిగిపోయారు. ఇక ఆ తర్వాత సీనియర్లు కల్పించుకోవడంతో ఇదంతా సద్దుమణిగింది అని చెప్పాలి.

 చివరికి ఇక ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో 15 పరుగుల తేడాతో ఓడిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. అయితే ఇక రాజస్థాన్ జట్టు విజయం సాధించిన అనంతరం ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్  ట్విట్టర్ వేదికగా ఒక పోస్టు పెట్టగా.. ఇక ఈ పోస్ట్ పై అటు నెటిజన్లు మాత్రం ఫైర్ అవుతూ ట్రోల్ చేయడం మొదలు పెడుతున్నారు. మీది అసలైన గెలుపు కాదు  పంత్ నీ కంటే ఎన్నో రెట్లు బెటర్. అసలు ఎంపైర్ కు ఎంత ముట్టచెప్పారు అంటు విపరీతంగా కామెంట్లతో ట్రోల్ చేయడం మొదలు పెడుతున్నారు. కాగా రిషబ్ పంత్ తనకు చెయ్యెత్తి విష్ చేస్తున్నట్లుగా ఉన్న ఒక ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంజూ శాంసన్ నైజ్ (nize) విన్ అని ఒక క్యాప్షన్ జత చేశాడు.

 ఇక ఇప్పుడు ఇదే సంజు శాంసన్ ట్రోలింగ్ కి కారణమైంది అని తెలుస్తోంది. (Nize) అంటే విజయంతోనే నోరు ముయించాం లేదా అద్భుతమైన సులభతరమైన విజయం సాధించామని రెండు అర్థాలు వస్తూ ఉంటాయి. ఇక కావాలనే సంజూ శాంసన్ ఇలా సోషల్ మీడియాలో ట్వీట్ చేసి రెచ్చగొడుతున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక పంత్ ది ఒక్క ఫోటో మాత్రమే ఎందుకు షేర్ చేశారు.. మీకు సహాయం చేసిన అంపైర్  ఫోటో కూడా షేర్ చేసి ఉంటే బాగుండేది అని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: